రిలీజ్ కాకమునుపే పాటలతో ఎంతో క్రేజ్ ను సంపాదించిన సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి లు జంటగా నటించి అందరినీ మెప్పించారు. ఈ సినిమా టీజర్ సంక్రాంతి కానుకగా రీలీజ్ అయ్యింది. ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఈ టీజర్ ను మెగా హీరో రామ్ చరణ్ కూడా చూసారండి బాబు.. అందుకే ఈ టీజర్ కు ఫిదా అయ్యి దీనిపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇదిలా ఉంటే ఈ ఉప్పెన సినిమా పోయిన సంవత్సరమే రిలీజ్ కావాల్సి ఉండే.. కానీ ఈ కరోనా మహమ్మారి ఎంట్రీ ఇవ్వడంతో.. ఈ ఉప్పెన ను లేట్ గా రిలీజ్ చేసేందుకు నిర్ణయించుకున్నారు ఈ చిత్ర దర్శక నిర్మాతలు.

ఈ సమ్మర్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఈ చిత్ర యూనిట్ చెబుతోంది. అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పాటలు ఈ సినిమాపై మరింత అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి. అందుకే ప్రేక్షకులు ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగేలా ఈ సంక్రాంతికి టీజర్ ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది చిత్ర యూనిట్. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడేలా చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాగా ఈ టీజర్ ను లేట్ గా చూసిన మెగా రామ్ చరణ్ కూడా స్పందించాడు. టీజర్ చాలా అందంగా ఉంది. బ్రదర్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంట చాలా బాగుంది. ఈ జంట ఫ్రెష్ గా అనిపిస్తోంది. అలాగే దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాణ సంస్థ మైత్రి, ఇతర టెక్నీషియన్స్ కు శుభాకాంక్షలు అలాగే ఆల్ ది బెస్ట్ అంటూ మెగా హీరో రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాపై సినీ ప్రేక్షకులకే కాకుండా సినీ  ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి హోప్ ఉంది. పాటలతోనే ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: