ఈ సమ్మర్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ఈ చిత్ర యూనిట్ చెబుతోంది. అందుకు తగ్గ ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా పాటలు ఈ సినిమాపై మరింత అంచనాలు ఏర్పడేలా చేస్తున్నాయి. అందుకే ప్రేక్షకులు ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. అందుకే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగేలా ఈ సంక్రాంతికి టీజర్ ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది చిత్ర యూనిట్. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ టీజర్ ఈ సినిమాపై భారీ అంచనాలే ఏర్పడేలా చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా ఈ టీజర్ ను లేట్ గా చూసిన మెగా రామ్ చరణ్ కూడా స్పందించాడు. టీజర్ చాలా అందంగా ఉంది. బ్రదర్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంట చాలా బాగుంది. ఈ జంట ఫ్రెష్ గా అనిపిస్తోంది. అలాగే దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాణ సంస్థ మైత్రి, ఇతర టెక్నీషియన్స్ కు శుభాకాంక్షలు అలాగే ఆల్ ది బెస్ట్ అంటూ మెగా హీరో రామ్ చరణ్ ట్వీట్ చేశాడు. ఈ సినిమాపై సినీ ప్రేక్షకులకే కాకుండా సినీ ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి హోప్ ఉంది. పాటలతోనే ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో వేచి చూడాలి.