ఈ ఇద్దరు ఇప్పుడు ఎవరి ప్రాజెక్టుల్లో వారు బిజీగా ఉన్నారు. అయితే స్టార్ట్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించే పొన్నీయిన్ సెల్వన్ సినిమాకు ఏఆర్. రెహ్మన్ సంగీతం అందిస్తుండగా.. అదే కథతో .. అదే టైటిల్తో తెరకెక్కుతోన్న వెబ్ సీరిస్కు మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఓ వైపు మణి పొన్నియన్ సెల్వన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉంటే... మరోవైపు చిరంజీవి అనే ఫిల్మ్ మేకర్ పొన్నియన్ సెల్వన్ వెబ్ సీరిస్ లాంచ్ చేస్తున్నారు.
ఒకే కథాంశం.. ఒకే టైటిల్... ఈ రెండిటికి లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ అందిస్తున్నారు. ఇద్దరూ లెజెండ్సే దీంతో ఈ రెండు క్రేజీ ప్రాజెక్టులకు ఎవరి మ్యూజిక్ బాగా హైలెట్ అవుతుంది ? అన్నదానిపై సహజంగానే ఆసక్తి రేగడంతో పాటు పోటాపోటీ అన్న చర్చలు స్టార్ట్ చేశారు కొందరు సినీ అభిమానులు. ఇక రత్నం పొన్నియన్ సెల్వన్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో తెరకెక్కుతోంది. ఈ షూటింగ్లో ప్రకాష్ రాజ్ - ఐశ్వర్యారాయ్ బచ్చన్ పై సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇక చిరంజీవి పొన్నియిన్ సెల్వన్ ఆగస్టు 18న ప్రారంభమవుతోంది.