తెలుగులో అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది శ్రుతిహాసన్..  ఓ మై ఫ్రెండ్, గబ్బర్ సింగ్, బలుపు, రామయ్యా వస్తావయ్యా, ఎవడు,రేసుగుర్రం వంటి చిత్రాలతో చాలా తక్కువ సమయంలోనే ఇండ్రస్టీ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ని తన సొంతం చేసుకుంది. ఆ తర్వాత హిందీలో కూడా అగ్ర హీరోల సరసన కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడికి బాలీవుడ్ ఇండస్ట్రీ అంతగా కలిసి రాలేదనే చెప్పాలి.మళ్ళీ టాలీవుడ్ కి  వచ్చి ఇక్కడే హీరోయిన్ గా కొనసాగుతోంది. అయితే గత కొంతకాలంగా తెలుగులో సరైన హిట్ లేక మళ్ళీ తమిళ ఇండ్రస్టీ కి వెళ్లిపోయిన శ్రుతిహాసన్...

 ఇప్పుడు తాజగా తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.టాలీవుడ్ లో ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టిన ఈ అమ్మడు తాజాగా రవితేజ సరసన క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సరసన వకీల్ సాబ్ సినిమాలో నటిస్తోంది శృతీ హాసన్.  ఈ సినిమాకి సంబందించి టీజర్ సంక్రాంతి రోజు విడుదల అయ్యి మంచి వ్యూస్ సాధించింది.వకీల్ సాబ్ సినిమాలో శృతి హాసన్ నటించినా..టీజర్ లో మాత్రం కనపడలేదు. ఈ సినిమాలో శృతి పాత్ర పరిమితంగా ఉంటుందట. ఆమెకు ఇవ్వవలసిన పారితోషికం కూడా తగ్గించి ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దానికి కూడా ఒక కారణం ఉంది.

పవన్,శృతి మీద ఒక పాటను క్యాన్సిల్ చేశారట. అందుకే ఆమెకు ఇవ్వవలసిన పారితోషికంలో 20 లక్షలు తగ్గించి ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.టీజర్ లో పవన్ ఎలివేషన్ కు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు.అయితే టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.ప్రస్తుతం థియేటర్లలో విడుదలైన సినిమాలకు కలెక్షన్లు భారీ మొత్తంలో వస్తున్నాయి..మళ్ళీ థియేటర్లకు పూర్వ వైభవం రావడంతో ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: