ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..స్టైలిష్  స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప" మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతుందని సమాచారం అందుతుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి.వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తరువాత అల్లు అర్జున్.. కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఈ వేసవి నుండి వీరి కాంబినేషన్ లో సినిమా మొదలయ్యే అవకాశాలు వున్నాయట.ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కి మంచి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. దానికోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించాలని ప్లాన్ చేస్తున్నారట.


ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే సాయి మంజ్రేకర్. సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి హృతిక్ రోషన్ "సూపర్ 30" సినిమాతో మంచి  గుర్తింపు తెచ్చుకుంది. సాయి మంజ్రేకర్ ప్రస్తుతం తెలుగులో ‘మేజర్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు వరుణ్ తేజ్ నటిస్తోన్న స్పోర్ట్స్ డ్రామాలో కూడా హీరోయిన్ గా ఈ బ్యూటీ నటిస్తుంది. ఈ అమ్మడు తన అందం అభినయంతో దర్శకనిర్మాతల దృష్టిలో పడింది.

 ఇప్పుడు అల్లు అర్జున్-కొరటాల శివ సినిమా కోసం కూడా ఈమెనే తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ సినిమాను GA2 పిక్చర్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్నాయని సమాచారం అందుతుంది. వచ్చే ఏడాది  ఆరంభంలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: