ఇంతకీ ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు అనుకుంటున్నారా.. అదేం లేదండీ.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. అందులో ఒకటి మలయాళం రీమేక్ సినిమా అయ్యప్పనుం కోశియుమ్.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో రానా కూడా మరో కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా కి మాటలు రాస్తున్నది త్రివిక్రమ్.. అయితే త్రివిక్రమ్ మాటలు రాస్తున్నందుకు పవన్ ఫ్యాన్స్ కి ఓ వైపు సంతోషం గా ఉన్నా మరోవైపు టెన్షన్ గా ఉందట.. అందుకు కారణం మీకు కూడా తెలుసు..
డైరెక్టర్ అయ్యాక త్రివిక్రమ్ మాటల రచయితగా చేసిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. జైచిరంజీవ, తీన్మార్ చిత్రాలు ఎలాంటి ఫలితాలు ఇచ్చాయి అందరికి తెలిసిందే.. ఈ నేపథ్యంలో తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత ప్రాణ స్నేహితుడి కోసం మరోసారి రెడీ మాటలు రాసేందుకు రెడీ అయిన త్రివిక్రమ్ ఎలాంటి ఫలితం తీసుకొస్తాడో అని భయపడుతున్నారు.. గత ఫలితాలు రిపీట్ కాకూడదనే ఫ్యాన్స్ కోరిక. సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ లు హీరోయిన్లు గా చేస్తున్న ఈ సినిమా కి తమన్ సంగీతం అందిస్తుండగా బిల్లారంగా అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు.