గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సమంత నటించిన "ఏ మాయ చేశావే" మూవీ కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టిందనే చెప్పుకోవాలి. ఈ సినిమాలో జెస్సీ పాత్రను డైరెక్టర్ ప్రత్యేకంగా మలిచాడు. తాము మనువాడబోయే అమ్మాయి ఇలాగే ఉండాలి అంటూ యూత్ ఫిక్సయిపోయారు.


ఈ విధంగా టాలీవుడ్ లో సమంత మ్యాజిక్ స్టార్టయింది. ఈ సినిమాలో నాగచైతన్యతో సమంత కెమిస్ట్రీకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. వీరిద్దరూ రియల్ లైఫ్ లో కూడా కపుల్ గా మారితే బాగుంటుందని ఆశించారు. అభిమానుల కోరికను ఈ జంట నెరవేర్చారు. రియల్ లైఫ్ లో కూడా తమ కెమిస్ట్రీ వర్కవుట్ అవుతోందని భావించి ఒక్కటయ్యారు. 


ఐతే, సమంత వివాహానికి ముందు హీరోలతో డ్యూయెట్స్ పాడే పాత్రల్లో నటించింది. హీరోలను కవ్వించే పాత్రల్లో కనువిందు చేసింది. వివాహమయ్యాక ఇల్లాలుగా మారాక సమంత అటువంటి పాత్రలకు ఈజీగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభించే పాత్రలకే పచ్చ జెండా ఊపుతోంది.

 

ఆ కోవలోకే "యూ టర్న్", "మహానటి", అలాగే "ఓహ్ బేబీ" సినిమాలు వస్తాయి. అలాగే, సమంత కేవలం నటనకే పరిమితం కాకుండా హోస్టింగ్ స్కిల్స్ ను కూడా బయటికి తీస్తోంది. 'సామ్ జామ్' షో తో సందడి చేసింది. 


త్వరలో పౌరాణిక చిత్రంలో తళుక్కుమనబోతోంది. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న "శాకుంతలం" మూవీలో సందడి చేయబోతోంది. ఈ సినిమా సమంత కెరీర్లో మైల్ స్టోన్ గా నిలవబోతోంది. 


స్టార్ హీరోస్ పక్కన పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ హీరోయిన్స్ కు రావడం చాలా అరుదు. కాబట్టి, స్టార్ హీరోస్ తో సమంతకు ఎక్కువగా ఆఫర్స్ రావడం లేదన్న టాక్ వినిపిస్తోంది. వివాహం తరువాత సమంత పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ కే ప్రాధాన్యతనిస్తోందన్న విషయం తెలిసిందే. 


సమంత డెసిషన్ ను ఆడియెన్స్ గౌరవిస్తున్నారు. "శాకుంతలం" మూవీ కోసం ఆడియెన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సమంతకు జోడీగా నటించబోయేది ఎవరో తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: