బుల్లితెర ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్న ఏకైక కామెడీ షో ఏదైనా ఉందీ అంటే.. అది కచ్చితంగా ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో అనే చెప్పాలి.. వారంలో ప్రతి గురువారం, శుక్రవారం జబర్థస్త్, ఎక్స్‌ట్రా జబర్థస్త్ ప్రోగ్రాం గురించి ఎదురు చూడని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఈ రెండు షో లకు టీవీ లో కంటే యూ ట్యూబ్‌ లోనే కొన్ని లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. లాక్‌డౌన్ తర్వాత టీఆర్పీల విషయంలో కాస్త వెనుకబడిన ఈ ప్రోగ్రామ్స్ మళ్లీ లాక్ డౌన్ తరువాత తనదైన దూకుడు చూపిస్తూనే ఉంది.అయితే, ఎక్కువమందికి వచ్చే డౌట్ ఏమిటంటే ఈ షోలో ఎవరెవరు ఎంతెంత పారితోషకం తీసుకుంటారనేది.

ఇక జబర్ధస్త్ జడ్జ్‌గా రోజాకు నెలకు రూ. 20 లక్షల నుంచి రూ.25 లక్షల అలాగే మరోవైపు జబర్థస్త్ జడ్జ్ నాగబాబు ప్లేస్‌లో వచ్చిన మనో గారికి ఇపుడు రూ.10 లక్షల వరకు పారితోషకం ఇస్తున్నారట. బబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్ధస్త్ ల హాట్ యాంకర్స్ అనసూయ మరియు రష్మి లకు నెలకు రూ. 4లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇక టీమ్ లీడర్స్ విషయానికి వస్తే చమ్మక చంద్ర, హైపర్ ఆది కంటే ఎక్కవగా నెలకు రూ. 4.లక్షల వరకు పారితోషకం అందుకుంటున్నది వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా సుడిగాలి సుధీర్ కు 3.5 లక్షలు, హైపర్ ఆదికి రూ.3 లక్షలు అందుకుంటున్నరు.

మరోవైపు గెటప్ శ్రీను, రాకెట్ రాఘవ, కిరాక్ ఆర్పీలు రూ.2.5 లక్షలు అందుకుంటున్నారట. బుల్లెట్ భాస్కర్ కు రూ.2 లక్షలు, ఇతర కమెడియన్లకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి..ఇక మరోవైపు ప్రతీ పండక్కి ఒక స్పెషల్ ఈవెంట్ ని నిర్వహిస్తారు.. అందులో సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రష్మీ లాంటి వాళ్లు కచ్చితంగా ఈ స్పెషల్ ఈవెంట్స్ లో ఉండాల్సిందే...సో అలా మొత్తానికి మన బుల్లితెర ప్రేక్షకులను తమ కామెడీ పంచులతో, స్కిట్లతో కడుపుబ్బా నవ్విస్తున్న మన జబర్దస్త్ టీమ్ లీడర్స్ కి భారీ మొత్తంలోనే అందుతోందన్నమాట...!!


మరింత సమాచారం తెలుసుకోండి: