సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో బ్లాక్ బస్టర్స్ పేర్లు చెప్పాలంటే ముందుగా మొదలు పెట్టేది ‘ఒక్కడు’ సినిమా గురించే. ఆయన కెరీర్లో మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ ‘ఒక్కడు’ సినిమానే అని అందరికీ తెలుసు. ఈ సినిమా సరిగ్గా 2003వ సంవత్సరంలో సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 15వ తారీఖున రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్లు సాధించింది. ఆ టైంలో రిలీజ్ అయిన అన్ని సినిమాల కంటే ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. దీంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ఈ సినిమా ప్రభావంతో మిగతా సినిమాలు బాక్సాఫీస్ వద్ద తేలిపోయాయి.

‘ఒక్కడు’ సినిమా విజయంతో మహేష్ కి మాస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. అటువంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ ఏడాదితో 18 సంవత్సరాలు గడిచాయి. ఈ నేపథ్యంలో మహేష్ భార్య నమ్రత ఈ సినిమాను ప్రస్తావిస్తూ ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు పెట్టింది. “ఒక్కడు నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా’’ అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్టులో డైరెక్టర్ గుణ శేఖర్, అదే విధంగా మిగతా చిత్ర యూనిట్ సభ్యుల పేర్లన్నీ ప్రస్తావించింది. వారందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలపింది. అయితే ఈ సందర్భంలోనే నమ్రత ఓ పొరబాటు చేసేసింది. తన పోస్టులో ‘‘ఒక్కడు’’ నిర్మాత ఎమ్మెస్ రాజు పేరు చేర్చడం మర్చిపోయింది.

ఈ విషయం గమనించిన కొందరు ఈ విషయాన్ని ఎత్తి చూపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెస్ రాజు దీనిపై మాట్లాడుతూ.. ‘‘పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అయినా పర్లేదు. నేను నిర్మించిన సినిమా క్లాసికల్. నమ్రతకు ఇది అంత బాగా నచ్చటం చాలా సంతోషం ఉంది’’ అని పేర్కొన్నారు. దీంతో వెంటనే తన పొరపాటు గ్రహించిన నమ్రత.. దాన్ని సరిదిద్దుకుంటూ ఎమ్మెస్ రాజు పేరును కూడా తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో చేర్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: