‘ఒక్కడు’ సినిమా విజయంతో మహేష్ కి మాస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. అటువంటి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ ఏడాదితో 18 సంవత్సరాలు గడిచాయి. ఈ నేపథ్యంలో మహేష్ భార్య నమ్రత ఈ సినిమాను ప్రస్తావిస్తూ ఓ ఇన్స్టాగ్రామ్ పోస్టు పెట్టింది. “ఒక్కడు నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా’’ అని పోస్ట్ పెట్టింది. ఈ పోస్టులో డైరెక్టర్ గుణ శేఖర్, అదే విధంగా మిగతా చిత్ర యూనిట్ సభ్యుల పేర్లన్నీ ప్రస్తావించింది. వారందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలపింది. అయితే ఈ సందర్భంలోనే నమ్రత ఓ పొరబాటు చేసేసింది. తన పోస్టులో ‘‘ఒక్కడు’’ నిర్మాత ఎమ్మెస్ రాజు పేరు చేర్చడం మర్చిపోయింది.
ఈ విషయం గమనించిన కొందరు ఈ విషయాన్ని ఎత్తి చూపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెస్ రాజు దీనిపై మాట్లాడుతూ.. ‘‘పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అయినా పర్లేదు. నేను నిర్మించిన సినిమా క్లాసికల్. నమ్రతకు ఇది అంత బాగా నచ్చటం చాలా సంతోషం ఉంది’’ అని పేర్కొన్నారు. దీంతో వెంటనే తన పొరపాటు గ్రహించిన నమ్రత.. దాన్ని సరిదిద్దుకుంటూ ఎమ్మెస్ రాజు పేరును కూడా తన ఇన్స్టాగ్రామ్ పోస్టులో చేర్చింది.