ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ నాని నటించిన "గ్యాంగ్ లీడర్" సినిమాలో విలన్ గా నటించి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఆ క్రేజ్ తో  తమిళ స్టార్ హీరో  అజిత్‌ కొత్త సినిమా ‘వాలిమై’లో కార్తికేయ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా పుణె షెడ్యూల్‌ పూర్తయింది‌.అజిత్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘వలిమై’. ఇందులో అజిత్‌ మోటార్‌ స్పోర్ట్స్‌ ప్లేయర్‌గా కనిపిస్తాడని సమాచారం. పుణెలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో అజిత్‌ స్పెషల్‌ బిరియానీ గురించి కార్తికేయ తెలుసుకుని.. తమ కోసం వండమని కోరాడాట.

అతని కోరికను మన్నించి అజిత్‌ చక్కగా బిరియానీ వండి అందరికీ ట్రీట్‌ ఇచ్చాడట. అందరూ ఆ బిరియానీని బాగా ఎంజాయ్‌ చేశారట. అజిత్‌ చేత్తో వండిన బిరియానీ తిని ఫిదా కాని వారు ఎవరూ ఉండరు.తాజాగా కార్తికేయ కూడా అదే ఫీల్‌ని ఎంజాయ్‌ చేశాడట. మరి అజిత్‌కు ఉన్న ఎక్స్‌ట్రా టాలెంట్‌ ఫొటోగ్రాఫర్‌ను కూడా త్వరలో కార్తికేయకు చూపిస్తాడేమో. అజిత్‌ తీసిన ఫొటోలు మామూలుగా ఉండవనే విషయం తెలిసిందే. మరి అజిత్‌తో కార్తికేయ ఫొటో తీయించుకుంటాడామో చూడాలి. ఇక వలిమై సినిమా విషయానికి వస్తే  ‘వలిమై’ పూర్తి స్థాయి మాస్‌ మసాలా సినిమాగా రూపొందుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్టంట్స్‌ పూర్తయ్యాయని సమాచారం అందుతుంది. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...
తాజాగా కార్తికేయ కూడా అదే ఫీల్‌ని ఎంజాయ్‌ చేశాడట. మరి అజిత్‌కు ఉన్న ఎక్స్‌ట్రా టాలెంట్‌ ఫొటోగ్రాఫర్‌ను కూడా త్వరలో కార్తికేయకు చూపిస్తాడేమో. అజిత్‌ తీసిన ఫొటోలు మామూలుగా ఉండవనే విషయం తెలిసిందే. మరి అజిత్‌తో కార్తికేయ ఫొటో తీయించుకుంటాడామో చూడాలి. అన్నట్లు ‘వాలిమై’ పూర్తి స్థాయి మాస్‌ మసాలా సినిమాగా రూపొందుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన స్టంట్స్‌ పూర్తయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: