తమిళ సూపర్ స్టార్ ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సినిమా మాస్టర్. యాక్షన్, ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా ఈనెల 13వ తేదీన రిలీజ్ అయి యావరేజ్ టాక్ ను సంపాదించుకుంది. తమిళ్ తో పాటు పలు ఇతర భారతీయ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ అయిన ఈ సినిమా పై విజయ్ ఫ్యాన్స్ భారీస్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.

అయితే రిలీజ్ అనంతరం ఇది ఆశించిన రేంజ్ సక్సెస్ కాకపోవడంతో వారు కొంత నిరాశకు గురయ్యారు. నిజానికి అంతకుముందు యంగ్ హీరో కార్తీ తో ఖైదీ సినిమా తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్, ఆ మూవీతో భారీ సక్సెస్ ని అందుకున్న విషయం తెలిసిందే. దానితో ఆయనకి తన తదుపరి సినిమా అవకాశం ఇచ్చారు విజయ్. అసలు మ్యాటర్ ఏంటంటే ఇటీవల మాస్టర్ తెలుగు వర్షన్ ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసిన లోకేష్ కనకరాజ్, టాలీవుడ్ స్టార్ హీరోలుసూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లని కలిసి తనవద్దనున్న కథలను వారికి వినిపించారని అలానే పలువురు ఇతర హీరోలని కూడా ఆయన కలిసినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం తెరకెక్కిన మాస్టర్ ఆశించినంత సక్సెస్ ని సాధించకపోవడంతో తదుపరి ఆ హీరోలిద్దరూ కూడా  లోకేష్ తో సినిమా చేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.

ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ విషయమై బిజీగా ఉన్న మహేష్ బాబు తదుపరి త్రివిక్రమ్ అలానే రాజమౌళిలతో సినిమాలు చేసే అవకాశం కనబడుతోంది. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా, అలానే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య లో కూడా చరణ్ ఒక ముఖ్య పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. మరి ఈ ఇద్దరు నటులు దర్శకుడు లోకేష్ కి తమ తదుపరి సినిమా అవకాశాలు ఇస్తారా లేదా అనే విషయమై ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియాలి అంటే కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయక తప్పదు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: