నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీనుల కలయికలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ షూటింగ్ ప్రస్తుతం వేగవంతంగా జరుగుతోంది. యువ సంగీత తరంగం తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తుండగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలయ్య ఈ సినిమాలో డ్యూయల్ రోల్స్  చేస్తున్నట్లు సమాచారం.

అందులో ఒకటి అఘోర పాత్ర కాగా మరొకటి మధ్యతరగతి రైతు పాత్ర అని సమాచారం. గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కిన సింహా, లెజెండ్ సినిమాలు రెండూ కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ లు అందుకుని వారిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దానితో ఈ మూవీ పై బాలయ్య అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల రిలీజైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కి ప్రేక్షకాభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. మంచి మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా దర్శకుడు బోయపాటి తెరకెక్కిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మహాశివరాత్రి కానుకగా మార్చి 11న రిలీజ్ కానున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్.  

ఇప్పటికే సినిమా షూటింగ్  చాలావరకు పూర్తయిందని కాగా మిగతా భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి ఎట్టి పరిస్థితుల్లో మూవీని సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా మూవీ యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమా కోసం థమన్ ఐదు అద్భుతమైన ట్యూన్ రెడీ చేశాడని అలాగే సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా వండర్ ఫుల్ గా ఉంటుందని టాక్. మొత్తంగా చూసుకుంటే బాలయ్య-బోయపాటిల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ హ్యాట్రిక్ సక్సెస్ అందుకునేలా కనబడుతోందని అంటున్నారు విశ్లేషకులు. మరి అది ఎంతవరకు జరుగుతుందో తెలియాలి అంటే మరి కొన్నాళ్ళ వరకు వెయిట్ చేయక తప్పదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: