ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... సాధారణంగా సినిమాలు షూటింగులు జరుపుకుంటున్నప్పుడు కొన్ని సీన్స్ కాని సాంగ్స్ లేక ఫైట్స్ లాంటివి లీక్ అవుతూ ఉంటాయి. ఇలా లీక్డ్ వీడియోలు రావడం అభిమానులకు ఆనందమేమో కానీ… నిర్మాతలకు ఇంకా హీరోలకి మాత్రం అసంతృప్తి గా ఉంటాయి. లీకైన వీడియో ఎంత సేపు అన్నది పక్కనపెడితే… అసలు లీక్ ఎలా అయ్యింది అని తలలు పట్టుకోవడం వారి వంతవుతుంది. ఇలాంటి పరిస్థితి ఇటీవల కాలంలో పెద్ద హీరోల సినిమాలకు కచ్చితంగా ఎదురవుతూనే ఉంది. మన దేశంలో షూటింగ్ జరిగినా, విదేశంలో జరిగినా లీకులు మాత్రం కామన్. తాజాగా ఈ పరిస్థితి ‘రాధే శ్యామ్’కి వచ్చింది. సినిమా కోసం ఓ పాట షూట్ చేస్తుంటే ఆ వీడియోలో చిన్న బిట్ బయటకు వచ్చింది.
‘రాధే శ్యామ్’ పాటల చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ప్రభాస్, పూజా హెగ్డే మీద పాటను తెరకెక్కిస్తున్నారు. ఈలోగా ఎవరో వ్యక్తి దూరం నుంచి షూటింగ్ను మొబైల్లో రికార్డు చేసేశారు. ఆ తర్వాత దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదీ పరిస్థితి. ఎవరు చేశారు, ఎందుకు చేశారనేది అనేది మాత్రం నిర్మాతలకి అసంతృప్తి గా ఉందట. ఇంత స్ట్రిక్ట్గా షూటింగ్లో మొబైల్స్ వద్దు అని చెబుతున్నా ఎవరూ వినకపోవడం ఆశ్చర్యం.
ఇక ఈ విషయం పై ప్రభాస్ కూడా చాలా అసంతృప్తిగా వున్నాడట..ఈ విషయం పట్ల ప్రభాస్ చిత్ర యూనిట్ పై కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక ప్రభాస్ ఈ సినిమా తరువాత వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాలు చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి..