ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. 'టెంపర్ " తర్వాత పూర్తిగా తన పంథా మార్చిన తారక్ వైవిద్యమైన సినిమాలు చేస్తూ సక్సస్ రేటును అమాంతంగా పెంచుకున్నాడు. ఇదే జోరుతో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న " ఆర్.ఆర్.ఆర్ " సినిమాలో కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తారక్ తో పాటు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో తన తదుపరి సినిమాను ఖరారు చేశాడు యంగ్ టైగర్. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

 ఈ సినిమాకు "అయినను పోయిరావలే హస్తినకు" అనే పేరును పరిశీలిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన " అరవింద సమేత వీరరాఘవ " సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో వీరిద్దరి కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా పట్టాలెక్కక ముందే ఎన్‌టీఆర్ మరో సినిమాను లాక్ చేశాడట. దీనికి తమిళ సూపర్ స్టార్ థలపతి విజయ్ హీరోగా మాస్టర్ సినిమాను తెరకెక్కించిన లోకేష్ కనకారాజ్  దర్శకత్వం చెయ్యనున్నాడు అనే వార్తలు ప్రస్తుతం ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్నాయి.

వీరి కాంబినేషన్ ను ప్రముఖ నిర్మాత మహేశ్ కోనేరు సెట్ చేశాడని సమాచారం. "మాస్టర్" తెలుగు హక్కులను కొనుగోలు చేసిన నిర్మాత మహేష్ కోనేరు. ఈయన కు అటు తారక్ తోను, ఇటు లోకేష్ తోను మంచి స్నేహం ఉంది. ఈ స్నేహంతోనే తన బెస్ట్ ఫ్రెండ్ ఎన్‌టీఆర్‌తో సినిమాను లాక్ చేశాడట. మరి వీరి కాంబినేషన్ లో  సినిమా త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాత మొదలవుతుందని సమాచారం. ఈ సినిమాను మహేష్ కోనేరు  సొంత బ్యానర్ కోస్ట్ ఎంటర్‌టైన్మెంట్, కళ్యాణ్ రామ్ ఎన్‌టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మించనున్నాయట. మరి ఈ వార్తలపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: