సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట కోసం ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఎప్పటి నుంచొ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ గత ఏడాది వేసవి తర్వాత ప్రారంభం కావాల్సి ఉండగా కోవిడ్ కారణంగా విధించబడిన లాక్ డౌన్ వల్ల షూటింగ్ అప్పటి నుంచి వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల నవంబర్లో ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేశారు. అయితే అక్కడ వరుసగా కరోనా కేసులు పెరుగుతూ ఉండటంతోపాటు యూనిట్ లో కొందరికి వీసా సమస్యలు తలెత్తడంతో అక్కడ షూటింగ్ ని క్యాన్సిల్ చేసి హైదరాబాద్ కు మార్చినట్లు సమాచారం.

ఇటీవల కొద్ది రోజుల క్రితం నుండి ఈ మూవీకి సంబంధించి ఒక భారీ సెట్ ని రామోజీ ఫిలిం సిటీ లో రూపొందిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీహెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల 25న దుబాయ్ లో జరుగుతుందని అక్కడ దాదాపుగా పదిహేను రోజుల షూటింగ్ అనంతరం తదుపరి షెడ్యూల్ హైదరాబాదులో చేస్తారని అంటున్నారు. ఆపై అమెరికా మరియు జార్జియా దేశాల్లో రెండు భారీ షెడ్యూల్స్ అనంతరం సినిమా పూర్తవుతుందని అలానే దీనిని సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆగస్టు 9న రిలీజ్ చేసేందుకు మూవీ యూనిట్ పక్కా ప్రణాళిక సిద్ధం చేసిందని అంటున్నారు.

బ్యాంకు మోసాలు, కుంభకోణాలు నేపథ్యంలో మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులు కలగలిపి దర్శకుడు పరశురామ్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. తొలిసారిగా మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్, మైత్రి మూవీ మేకర్స్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు దీనిని గ్రౌండ్ లెవెల్ లో ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్నాయి.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: