రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న లేటెస్ట్ రెట్రో లవ్ స్టోరీ సినిమా రాధేశ్యామ్. కొన్నేళ్ళ క్రితం యూరప్ లో జరిగిన ఒక యదార్థ ప్రేమ కథ కి దృశ్య రూపకంగా మంచి కమర్షియల్ హంగులు, హృద్యమైన ఎమోషన్స్ కలగలిపి దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యు.వి.క్రియేషన్స్, గోపి కృష్ణ మూవీస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్ లో ఎంతో భారీగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, భాగ్యశ్రీ, ప్రియదర్శి, జయరాం తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ ని అందిస్తుండగా మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇందులో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు ప్రేక్షకాభిమానులను ఎంతో ఆకట్టుకోవడంతో పాటు యాక్షన్ సన్నివేశాలు కూడా ఎంతో అదిరిపోనున్నట్లు టాక్. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కి మంచి స్పందన లభించడంతో పాటు మూవీపై అది మంచి అంచనాలు కూడా క్రియేట్ చేసింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ అతి త్వరలో రిలీజ్ చేయనున్నాం అంటూ దర్శకుడు రాధాకృష్ణ తన సోషల్ మీడియా ద్వారా మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్ కి ఒక అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే సంక్రాంతి పండగ సందర్భంగా టీజర్ రిలీజ్ అవుతుందని రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ భావించారు కానీ అది జరగలేదు. అందుతున్న సమాచారాన్ని బట్టి కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా టీజర్ మరి కొద్ది రోజుల పాటు వాయిదా వేసిందట మూవీ యూనిట్. ఇక ఫస్ట్ లుక్ టీజర్ ని గణతంత్ర దినోత్సవం రోజైన జనవరి 26న రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారట యూనిట్. ఎట్టి పరిస్థితుల్లో టీజర్ ఆ రోజు రిలీజ్ అవుతుందని అతి త్వరలో దానికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా బయటకు రానుందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే ఇది నిజంగా రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి మంచి పండుగ వార్త అనే చెప్పాలి.......!!

మరింత సమాచారం తెలుసుకోండి: