క్రాక్ తో రవితేజ తిరిగి ఫాం లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు. క్రాక్ తర్వాత రమేష్ వర్మ డైరక్షన్ లో ఖిలాడి సినిమా చేస్తున్నాడు మాస్ రాజా. ఈ సినిమా తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ లో రవితేజ సినిమా ఉంటుందని టాక్. ప్రస్తుతం ఆ బ్యానర్ తో చర్చలు జరుపుతున్నారని తెలుస్తుంది. అసలైతే మారుతి డైరక్షన్ లో రవితేజ హీరోగా యువి బ్యానర్ లో సినిమా రావాల్సి ఉంది. కాని రవితేజ ఎందుకో ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ చూపలేదు.
అందుకే వేరే డైరక్టర్ తో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. రవితేజ ఫాం లోకి రావడంతో దర్శక నిర్మాతలు వెంట పడుతున్నారు. అయితే హిట్టు కొట్టడం తేలిక కాదు దానితో పాటుగా ఆ హిట్ మేనియా కొనసాగించడం కూడా అంత తేలికైన విషయం కాదు సరైన కథలను ఎంపిక చేసుకుంటేనే రవితేజ ఈ ఫాం కొనసాగించే అవకాశం ఉందని చెప్పొచ్చు.