కొద్దికాలంగా వైరల్ అవుతున్న విషయం మలయాళి హిట్ మూవీ" అయ్యప్పనుమ్ కోషియుమ్" అనే మూవీ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని ప్రచారం భారీగా జరిగింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం చిత్ర యూనిట్ ఈ రోజు ప్రకటించింది. ఈ సినిమానీ దర్శకుడు సాగర్ కే చంద్ర తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా కలిసి మల్టిస్టారర్ మూవీ చేస్తున్నారని.
ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లేతో పాటు మాటలు రాస్తున్న విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అయితే గతంలో పవన్ కల్యాణ్ నటించిన తీన్మార్ సినిమాకు కూడా త్రివిక్రమ్ మాటలు అందించిన విషయం తెలిసందే. ఈ చిత్రానికి సంగీతం తమన్నా అందిస్తున్నాడు . పవన్ కళ్యాణ్ జోడీగా సాయి పల్లవి, రానా జోడిగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. విలన్ పాత్రలకు ప్రసిద్ధి గాంచిన సుముద్రఖని, బ్రహ్మాజీ, మురళీశర్మ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. వకీల్ సాబ్ రిలీజ్ తర్వాత ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనగానే అభిమానుల్లో ఈ మూవీపై వారి అంచనాలు ఏర్పడ్డాయి.