టాలీవుడ్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో మహేష్ బాబు ఒకరు. క్లాస్ , మాస్ , అనే తేడా లేకుండా మహేష్ కు అభిమానఘనం ఉంది. అందువల్ల మహేష్ బాబు సినిమాలు ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల వరద పారిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తుంటాయి. ప్రస్తుతం మహేష్ బాబు గత కొంత కాలంగా ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఎందుకంటే " భరత్ అనే నేను , మహర్షి , సరిలేరు నికేవ్వరు " ఇలా  వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలు నమోదు చేశాడు. ఇప్పుడు అదే జోరు ను కొనసాగించడానికి పరశురామ్ తో " సర్కారు వారి పాట " సినిమా చేస్తున్నాడు.

 ఈ సినిమాలో మహేష్ ను ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా మహేష్ ను చూస్తారని డైరెక్టర్ అమద్య తెలిపిన సంగతి విధితమే. ప్రస్తుతం మహేష్ లుక్స్ చూస్తుంటే అది నిజమే అని తెలుస్తుంది. మహేష్ ఆ తరువాత చేయబోయే సినిమా రాజమౌళి దర్శకత్వం లో ఉంటుందని అమద్య రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా పై కూడా అప్పుడే అనేక ఊహాగానాలు మొదలైపోయాయి. ఇప్పటికే, రాజమౌళి త‌న నెక్ట్స్ మూవీ కోసం విజేంద్రప్రసాద్ కథ సిద్దం చేశాడని.. ఆ కథను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నాడని తెలుస్తోంది.

ఇక ఎప్పటి నుండి ఈ సినిమా పై అనేక రూమర్స్ బాగా వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు మరో రూమర్ ఒకటి ఈ సినిమా గురించి బాగా వినిపిస్తోంది. సినిమా ఛత్రపతి శివాజీ చరిత్ర ఆధారంగా రాబోతోందట. మహేష్ బాబు ఈ సినిమాలో ఛత్రపతి శివాజీగా నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ రూమర్ లో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో ఇంకా క్లారిటీ లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: