పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఇద్దరు కలిసి సినిమా చేస్తే.. అబ్బే సినిమా రికార్డులకు కేరాఫ్ అడ్రెస్ గా మారడం ఖాయం. మెగా ఫ్యాన్స్ కూడా మెగా మల్టీస్టారర్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫిల్మ్ నగర్ టాక్ చూస్తుంటే ఆ మెగా మల్టీస్టారర్ కు రంగం సిద్ధం అయ్యిందని అంటున్నారు. రాం చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరితో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట తమిళ స్టార్ డైరక్టర్ శంకర్. ఒకప్పుడు హిట్టు సినిమాకు కేరాఫ్ అడ్రెస్ గా ఉన్న శంకర్ ఈమధ్య కెరియర్ లో వెనకపడ్డారు.

రెండు సినిమాలు అతని ట్రాక్ రికార్డ్ డ్యామేజ్ అయ్యేలా చేశాయి. ఇక ఇదిలాఉంటే ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఇండియన్ 2 సినిమా ముందుకు సాగుతుందా.. ఆగిపోతుందా అన్న కన్ ఫ్యూజన్ కూడా ఉంది. అందుకే తెలుగులో ఓ స్ట్రైట్ సినిమా చేయాలని అనుకుంటున్నారట. అదికూడా చరణ్, పవన్ లతో పాన్ ఇండియా ప్రాజెక్ట్ షురూ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే శంకర్ టీం చరణ్ కు ఒక వర్షన్ వినిపించగా.. పవన్ కు కథ చెప్పే ఆలోచనలో ఉన్నారట.

చరణ్, పవన్ కలిసి సినిమా చేస్తే మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని ప్రియులు కూడా ఆ సినిమాను రిపీటెడ్ గా చూస్తారు. కరెక్ట్ సినిమా పడాలే కాని ఈ మల్టీస్టారర్ సినిమా మరో బాహుబలిలా అవుతుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం చర్చల దశల్లో ఉన్న ఈ సినిమా కన్ ఫాం అయితే మాత్రం మెగా ఫ్యాన్స్ ఆనదానికి అవధులు ఉండవు. ఓ పక్క చిరు పవన్ మల్టీస్టారర్ కోసం త్రివిక్రం కథ రెడీ చేస్తున్నాడని తెలుస్తుండగా ఇప్పుడు శంకర్ లైన్ లోకి రావడం సర్ ప్రైజ్ గా ఉంది.            

మరింత సమాచారం తెలుసుకోండి: