ఇక ఈ సినిమా రవితేజ కెరియర్ లోనే టాప్ గ్రాసర్ వైపుగా దూసుకుపోతుంది. ఈ సినిమాలో రవితేజ సరసన శృతి హాసన్ రెండవ సారి జత కట్టింది. ఈ సినిమాతో డైరెక్టర్ గోపీచంద్ మలినేని రవితేజతో హ్యాట్రిక్ హిట్ తన ఖాతా లో వేసుకున్నాడు. మరి అలాగే ఈ చిత్రం ఇప్పటికే అన్ని చోట్లా కూడా కేవలం 50 శాతం సీటింగ్ తోనే బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకుంది.మరి అయినప్పటికీ ఈ చిత్రం రెస్పాన్స్ మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గలేదు. అన్ని వర్గాల నుంచి ఇంకా మంచి ఆదరణ అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు మరిన్ని థియేటర్ లు పెంచుకుంటుంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రానికి గాను థియేటర్లు పెంచే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ సినిమాను ఆయా బాషల్లోకి రీమేక్ చేసేందుకు పలు నిర్మాణ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులకు గాను సోనూ సూద్ ఆల్రెడీ భారీ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే మరోపక్క తమిళ్ లో కూడా ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం మంచి పోటీ నెలకొందట. ప్రముఖ బ్యానర్ సంస్థలు క్రాక్ రీమేక్ హక్కులను కొనుగోలు చేసేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తుంది.