బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న విభిన్న హీరోయిన్  కంగనా రనౌత్. టాలెంట్ మెండుగా ఉన్న   ఈ బామ ఈ  మధ్యకాలంలో విమర్శల క్వీన్ గా కూడా  స్పీడ్ పెంచారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద న్యూస్ తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ సినిమాలపై ఫోకస్ పెట్టిన కంగనకు షాక్ ఇచ్చాడు ఓ వ్యక్తి. కాంట్రవర్సీ క్వీన్‌ కే ఎదురు నిలబడిన ఆ వ్యక్తి ఎవరు ఏమిటి అంటే....అతనో రచయిత అంట.

అసలు విషయం లోకి వెళ్తే...డైరెక్టర్ గా పూర్తి భాద్యతలు తీసుకుంటూ మణికర్ణిక సినిమా సీక్వెల్ చేయడానికి రెడీ అయ్యారు కంగనా అన్న వార్త అందరూ వినే ఉంటారు. చారిత్రాత్మక నేపథ్యంలో తెరకెక్కిన మణికర్ణిక సినిమా లో వీరనారి  ఝాన్సీ లక్ష్మీబాయి పాత్ర పోషించిన మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ కంగనా ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో తెలిసిందే...అయితే ఈ సినిమాకి  డైరెక్టర్ క్రిష్ తో సంయుక్తంగా దర్శకత్వం వహించిన కంగనా మణికర్ణిక సీక్వెల్ కు మాత్రం సోలో గా డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ చేసుకుంది.

ఈ సీక్వెల్ లో యోధురాలు అయిన కాశ్మీర్ రాణి దిద్ద బయోపిక్ ని తెరకెక్కించాలని అనుకుంది...అయితే అసలు సమస్య ఇక్కడే మొదలైంది ఈ కథ నాది అంటూ...నా అనుమతి లేకుండా నా కథతో  సినిమా ఎలా తీస్తావు అంటూ ప్రశ్నించాడు. ఇలా  కంగనాకు షాక్ ఇచ్చాడు ఓ రచయిత. కాంట్రవర్సీ క్వీన్‌ కే లీగల్ నోటీసులు పంపి ఆశ్చర్యపరిచాడు. ఆ వ్యక్తి పేరు ఆశిష్‌ కౌల్‌. ఇతనో రచయిత.అప్పటికే కాశ్మీర్ రాణి జీవితకథను 'దిద్దా.. కాశ్మీర్ కీ యోధా రాణి' పేరుతో ఆశిష్‌ కౌల్‌ పుస్తకం రాసున్నాడు.

కాబట్టి  దిద్దా జీవిత చరిత్రకు సంబంధించిన హక్కులన్నీ తనకే సొంతమని చెబుతూ  కంగనా కు లీగల్‌ నోటీసులు పంపాడు ఆశిష్‌ కౌల్‌. తన అనుమతి లేకుండా కంగనా రనౌత్‌ సినిమా తీస్తానని చెప్పడం వల్లే తను కంగనా రనౌత్‌కు లీగల్‌ నోటీసులు పంపామని వివరణ ఇచ్చాడు. అంతేకాదు  మూడు రోజుల్లో కంగనా రనౌత్‌ ఈ వ్యవహారంపై సమాధానం ఇవ్వాలని నోటీసులు పంపి మరీ గడువు పెట్టాడు ఆశిష్‌ కౌల్‌ తరపు న్యాయవాది. మరి ఈ వ్యవహారంపై కంగనా రనౌత్‌  ఎలా స్పందిస్తారో వేచి చూడాలి....ఆ రచయితకు తిరిగి షాక్ ఇచ్చిన ఫుల్ క్లారిటీ తో దిద్దా సినిమాను కంగనా తీస్తున్నారని  ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి: