ఎందుకంటే ఈ సినిమా పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతుండగా పాన్ ఇండియా దర్శకుడిగా పాతుకుపోవాలంటే ఈ సినిమా హిట్ కొట్టాల్సిన పరిస్థితి తప్పని సరి అయ్యింది.. లేదంటే మళ్ళీ జ్యోతిలక్ష్మి, రోగ్, పైసావసూల్ లాంటి సినిమాలు చేసు కోవాల్సిందే.. ఈ నేపథ్యంలో పూరీ జగన్నాధ్ విజయ్ సినిమా ను ఎంత సీరియస్ గా తీసుకున్నాడో చూడాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.. ఇకపోతే ఈ సినిమా తర్వాత పూరీ చేయబోయే సినిమా పై ఓ క్లారిటీ వస్తుంది.
సీనియర్ హీరో అక్కినేని నాగార్జున తో మూడో సినిమా చేయబోతున్నాడట పూరీ.. వీరి కలయికలో వచ్చిన తొలి సినిమా ‘శివమణి’ మంచి విజయం సాధించింది. అప్పట్లో ఆ సినిమాకు వచ్చిన క్రేజే వేరు. రిలీజ్ టైంలో కూడా మంచి హంగామా కనిపించింది. ఆ తర్వాత వీరి కలయికలో వచ్చిన ‘సూపర్’కు కూడా బంపర్ క్రేజ్ వచ్చింది. ఐతే ఆ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. దీంతో మళ్లీ ఈ కాంబినేషన్లో ఇంకో సినిమా రాలేదు.ఐతే దశాబ్దంన్నరకు పైగా విరామం తర్వాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా టాలీవుడ్లో ఒక ఆసక్తికర రూమర్ వినిపిస్తోంది.