ఇది నిజంగా జరిగితే మెగా ఫ్యాన్స్ కి అదిరిపోయే వార్తే అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ ఇద్దరూ కలసి ఒక సినిమాలో నటిస్తే థియేటర్లు ఊగిపోవూ. నిజంగా మల్టీ స్టారర్ మూవీస్ కే సరి కొత్త డెఫినిషన్ కూడా అవుతుంది ఈ కాంబో. అది జరగాలని ఎప్పటి నుంచో  మెగా ఫ్యాన్స్ గట్టిగానే  కోరుకుంటున్నారు.

దాని మీద తాజాగా ఒక వార్త అయితే జోరుగా  ప్రచారంలో ఉంది. రోబో వంటి సూపర్ డూపర్ హిట్ మూవీని తీసిన తమిళ దర్శకుడు శంకర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తాడని అంటున్నారు. ఈ ఇద్దరు టాప్ స్టార్స్ కాంబోని సెట్ చేయడానికి ఒక టాప్ తెలుగు ప్రొడ్యూసర్ రెడీ అయ్యారని అంటున్నారు.

రామ్ చరణ్ ఇపుడు ఆర్.ఆర్.ఆర్ మూవీతో బిజీగా ఉన్నారు. అదే విధంగా మెగాస్టార్ తో కలసి ఆచార్య మూవీ కూడా చేస్తున్నారు. అది కూడా మల్టీ స్టారర్ మూవీయే. ఈ రెండూ తరువాత చరణ్ చేయబోయే సినిమా ఇదేనని అంటున్నరు.

మరో వైపు పవన్ కళ్యాణ్ క్రిష్ మూవీతో పాటు, అయ్యప్పనుం కోషియం మూవీని చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు అయిన తరువాత చేయబోయే సినిమా ఇదేనని కూడా అంటున్నారు. అంటే అబ్బాయ్ బాబాయి కలసి ఒకే స్క్రీన్ పంచుకుంటే ఫ్యాన్స్ కి పూనకాలే వస్తాయన్నది నిజం.

ఇక పవన్ రామ్  చరణ్ లను ఒకే సినిమాలో  చూడడానికి వెండి తెర నిండుతనం పూర్తిగా సరిపోతుందా అన్న చర్చ కూడా ఉంది. ఇదిలా ఉంటే ఈ ఇద్దరి కాంబోకి సెట్ అయ్యేలా అదిరిపోయే కధను డైరెక్టర్ శంకర్ రెడీ చేశాడని, దాన్ని చరణ్ కి వినిపించాడని, పవన్ చేత కూడా ఓకే అనిపించుకుంటే ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: