కోలీవుడ్‌లోనే కాదు టోట‌ల్ సౌత్‌లోనే శంక‌ర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటి శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సెన్షేష‌న‌ల్ ప్రాజెక్టుకు రంగం సిద్ధ‌మ‌వుతోన్న‌ట్టు లీక్ అయిన వార్త టాలీవుడ్‌ను షేక్ చేసేస్తోంది. ఈ వార్తే నిజ‌మైతే ఆర్.ఆర్.ఆర్ త‌ర్వాత టాలీవుడ్ లో మ‌రో రెండేళ్ల పాటు ఈ వార్త పెద్ద సంచ‌ల‌నం రేపుతూనే ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి ఒకే సినిమాలో నటించడం అన్న‌దే ఊహించుకోవ‌డానికి థ్రిల్లింగ్ గా ఉంటే ఈ క్రేజీ ప్రాజెక్టుకు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నార‌న్న‌ది డ‌బుల్ సెన్షేష‌న్‌.

ఈ ఇద్ద‌రు స్టార్ హీరోలు - శంక‌ర్ కాంబినేష‌న్లో సినిమా సెట్ చేసేందుకు టాలీవుడ్‌కే చెందిన ఓ బ‌డా నిర్మాత ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్టు వార్త‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇందులో భాగంగా ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు, అటు చ‌ర‌ణ్‌కు స్టోరీ నెరేష‌న్ ఇచ్చేశార‌ని.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెమ్యున‌రేష‌న్ ఎంత సెట్ చేయాల‌న్న దానిమీదే త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు న‌డుస్తున్నాయ‌ట‌. అయితే ఇది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమాగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

శంక‌ర్ గ‌త సినిమాల్లాగా గ్రాఫిక్స్‌, వీఎఫ్ఎక్స్‌.. ఇత‌ర సాంకేతిక హంగులు ఉండ‌వంటున్నారు. ఇక శంక‌ర్ ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్‌తో ఇండియ‌న్ 2 సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా వ‌ర‌కు ఫినిష్ చేసుకుంది. అయితే త్వ‌ర‌లోనే త‌మిళ‌నాడు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాలు.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీ బిజీగా ఉన్నారు. దీంతో ఈ గ్యాప్‌లో శంక‌ర్ ఈ క్రేజీ ప్రాజెక్టును ఫినిష్ చేయాల‌నుకుంటున్నార‌ట‌.

ఇక శంక‌ర్ కూడా ఎప్ప‌టి నుంచో ఓ తెలుగు సినిమా నేరుగా చేయాల‌ని చూస్తున్నారు. ఆ కోరిక‌ ఈ క్రేజీ ప్రాజెక్టు రూపంలో తీర్చుకుంటున్నారు. ఆర్ ఆర్ ఆర్‌, ఆచార్య త‌ర్వాత చ‌ర‌ణ్ న‌టించే సినిమా ఇదే కాబోతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: