టాలీవుడ్‌లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ ఎవరంటే.. ఎవరికైనా వెంటనే గుర్తొచ్చే జంట నాగచైతన్య, సమంతలే. ఈ యంగ్ కపుల్ ఏం చేసినా అది ట్రెండింగ్ న్యూసే అవుతుంది. ఇటీవల సామ్ జామ్ షోకు నాగ చైతన్య వచ్చిన విషయం తెలిసిందే. ఈ షోలో నాగ చైతన్య, సమంతల మధ్య సంభాషణ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ప్రతి ఒక్క సెలబ్రిటీ సోషల్ మీడియా ఖాతాలలో బిజీగా ఉంటున్నారు. వేరే సెలబ్రిటీలు పెట్టే పోస్ట్‌లకు కామెంట్లు పెడుతూ ఉండటం కూడా చూస్తూనే ఉంటాం. నాగ చైత్యన్య, సమంతలు కూడా ఇదే విధంగా చేస్తుంటారు. అయితే భార్యా భర్తలు ఇద్దరూ ఒకరి పోస్ట్‌లపై మరొకరు కామెంట్లు పెట్టుకోవడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సమంత పెట్టే అనేక పోస్ట్‌లకు నాగ చైతన్య కామెంట్లు ఇస్తూనే ఉంటాడు. రానా దగ్గుపాటి పెళ్లి సమయంలో నాగ చైతన్య ఫార్మల్ డ్రెస్‌లో కనిపించాడు. ఆ ఫొటోను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా.. నాగ చైతన్య ఇదేదో పెయిడ్ పార్ట్‌నర్ షిప్ యాడ్‌లా ఉంది పోస్ట్ అంటూ తన దైన శైలిలో కామెంట్ పెట్టాడు. అదే విధంగా సమంత కూడా నాగ చైతన్య పెట్టే అనేక పోస్ట్‌లకు కామెంట్లు పెడుతూ వస్తుంది. తాజాగా నాగ చైతన్య పెట్టిన ఓ ఫొటోకు సమంత పెట్టిన కామెంట్ ట్రెండింగ్ అయిపోయింది. ‘థ్యాంక్యూ’ సినిమా షూటింగ్ సందర్భంగా దిగ్గజ సినిమాటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్ తీసిన ఫొటో నాగ చైతన్యకు ఎంతగానో నచ్చింది. బాగా నచ్చడంతో ఆ ఫొటోను నాగ చైతన్య తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.

ఈ బ్లాక్ అండ్ వైట్ ఫొటోలో నాగ చైతన్య ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఫొటో బాగుందంటూ.. నాగ చైతన్య ఏం ఆలోచిస్తున్నావ్ అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెడుతూ వచ్చారు. ఇదే సమయంలో నాగ చైతన్య సతీమణి సమంత కూడా సరదాగా ఆ పోస్ట్‌పై కామెంట్ చేసింది. ‘నువ్వు నా గురించే ఆలోచిస్తున్నావా?’ అంటూ సరదాగా నాగ చైతన్య ఫొటోపై కామెంట్ చేయగా.. నెటిజన్లు ఆ కామెంట్‌ చూసి ఎంతగానో ఆనందిస్తున్నారు. నాగ చైతన్య, సమంత జంట ఎప్పుడూ ఇలానే ఆనందంగా ఉండాలంటూ నెటిజన్లు వారిని ఆశీర్వదిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: