మాస్ మాహారాజా కథానాయకుడిగా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో వచ్చిన ‘క్రాక్’ సినిమా ఏ రేంజ్ లో ఘన విజయం సాదించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఇక చిరు క్రాక్ ను క్యూబ్ లో చూసారు. చూడటమే ఆలస్యం డైరెక్టర్ మలినేని గోపీచంద్ కు ఫోన్ చేసి సినిమాకు సంబంధించిన విషయాలను ముచ్చటించారట. ఒంగోలులో చిరు చదువుకుంటున్న రోజుల్లో వేటపాలెం గ్యాంగ్ ల గురించి వారి అలవాట్ల గురించి నేను కూడా విన్నానని చిరంజీవి డైరెక్టర్ తో గుర్తుచేసుకున్నాడట.
దీంతో పాటుగా ఒంగోలులో ముఖ్యంగా దీపాలు ఆర్పేసి మర్డర్లు చేయడం అనే అంశం గురించి కూడా డైరెక్టర్ తో మాట్లాడారట. ఇంకా ఒంగోలుకు సంబంధించి చిరంజీవి బాల్యంలో ఉన్నప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారట. అంతేకాకుండా ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సెట్ కు కూడా రమ్మని మలినేని గోపీచంద్ ను ఆహ్వానించాడర చిరు. సీనియర్ స్టార్ చిరంజీవి ఫోన్ చెయ్యడం.. గత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం.. ఆచార్య సెట్ కు కూడా ఆహ్వానించడంతో ‘క్రాక్’ డైరెక్టర్ ఫుల్ ఖుషీగా ఫీలవుతున్నాడట.