ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా బ్యానర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా.. అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా ఇందులో కనిపించనున్నాడు. ఈ సినిమాలో మరో కీలక పాత్ర అయిన పోలీస్ ఆఫీసర్ గా విజయ్ సేతుపతి కనిపించనున్నాడన్న వార్తలు వినిపించాయి. కానీ కరోనా మహమ్మారి కారణంగా పుష్ప షెడ్యూల్ పూర్తిగా చేంజ్ అయ్యింది. దాంతో డేట్స్ కుదరక విజయ్ సేతుపతి పుష్ప నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ పోలీస్ ఆఫీసర్ గా మరో యాక్టర్ పేరు వినిపిస్తోంది.
ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘పుష్ప’లో పోలీస్ ఆఫీసర్ గా కోలీవుడ్ హీరో శింబును పరిచయడం చేయడానికి డైరెక్టర్ ప్లాన్ చేస్తున్నాడట. కానీ హీరోగా మంచి అవకాశాలను అందుకుంటున్న ఈ స్టార్ హీరో సపోర్టింగ్ రోల్ చేయడానికి ఒప్పుకుంటాడా అనేదే సందేహం. కానీ ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమా పట్ల ప్రేక్షకులు మరింత ఆసక్తి చూపె అవకాశం లేకపోలేదు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందాన నటిస్తోంది. అయితే ఇందులో రష్మిక మునుపెన్నడూ కనిపించని విధంగా గిరిజన యువతిగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇంతమంది క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పట్ల ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు.