మలయాళంలో లూసిఫర్ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను తెలుగులో తాను రీమేక్ చేయనున్నట్టు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి చెప్పడం కూడా జరిగిపోయింది. తెలుగులో ఈ చిత్రాన్ని మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం లూసీఫర్ తెలుగు వెర్షన్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగానే మెగాస్టార్ లూసిఫర్ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశం ఉంది. అయితే లూసిఫర్ తెలుగు రీమేక్‌కు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మలయాళంలో లూసిఫర్ చిత్రాన్ని పృథ్వీ రాజ్ డైరెక్ట్ చేయడమే కాకుండా.. ఆయన ఆ సినిమాలో ఓ కీలక పాత్రలోనూ నటించాడు. అయితే తెలుగు ఈ పాత్రను చేయబోయేది ఎవరనే దానిపై వివిధ పుకార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ పాత్రను రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేస్తున్నాడనే వార్త ఎక్కువగా వినపడుతోంది. విజయ్ దేవరకొండతో పాటు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా బాగానే వినపడుతోంది. అయితే ఈ వార్తలన్ని పుకార్లే అని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం తెలుగులో పృథ్వీ రాజ్ క్యారెక్టర్‌ను తీసేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఆ క్యారెక్టర్ లేకుండా సినిమా కథ ముందుకు వెళ్తుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే పైన చెప్పిన రెండు విషయాల్లోనూ ఇప్పటి వరకు ఎటువంటి స్పష్టత రాలేదు. విజయ్ దేవరకొండ లూసిఫర్‌లో నటించబోతున్నాడు అనే దానిపై కాని, అసలు పృథ్వీ రాజ్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఉండదు అనే దానిపై కాని చిత్ర యూనిట్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఒక వేళ విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తే.. రౌడీ అభిమానులకు పండగే అని చెప్పాలి. కాగా.. ఆచార్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ద అనే క్యారెక్టర్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీంతో ఆచార్యపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: