ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన ప్రియురాలు నటాషా దలాల్‌ను ఈ నెల 24న పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ముంబైలోని అలీబాగ్‌లో వీరు ఇరు సంప్రదాయాల ప్రకారం పెళ్లిచేసుకోబోతున్నారట. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. కోవిడ్ -19 పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని కేవలం 50 మంది అతిథుల సమక్షంలోనే వివాహ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం వివాహం రాత్రి వేళ  సమయంలో జరగనుందట.

ఈ పెళ్ళికి  కొందరు ప్రముఖ బాలీవుడ్ సెలబ్రెటీలు కూడా హాజరవుంటున్నారట. గత వారం నుంచే వేడుకకు సంబంధించిన పనులు మొదలయ్యాయట. ముఖ్యంగా సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ వంటి స్టార్స్ స్పెషల్ గెస్టులుగా హాజరుకానున్నారని సమాచారం. ఇక జనవరి 26న ఈ జంట బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఇతర సన్నిహితుల కోసం గ్రాండ్ రిసెప్షన్ పార్టీని కూడా ఇవ్వడానికి  సిద్ధమైనట్లు సమాచారం అందుతుంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: