ఈ సినిమాను తన సొంత ప్రొడక్షన్ లోనే నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. తెలుగులో సీనియర్ ఎన్.టి.ఆర్, మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్.టి.ఆర్ ఈ ముగ్గురు మాత్రమే ఒకేసారి మూడు పాత్రలు చేశారు. ఏయన్నార్ ఏడు పాత్రలు చేసినా ఒకదాని తర్వాత ఒకటి కనిపించాయి. ఇక మిగతా వారంతా డ్యుయల్ రోల్ చేసి మెప్పించారు. అయితే వీరి తర్వాత కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. పర్ఫెక్ట్ కంటెంట్ కూడా తోడవడంతో రిస్క్ చేసేందుకు సిద్ధమయ్యాడు నందమూరి హీరో.
అంతేకాదు ఈ సినిమాకు తారక్ సలహాలు కూడా తీసుకుంటున్నాడని తెలుస్తుంది. అన్న కెరియర్ సెట్ రైట్ చేసేందుకు ఎన్.టి.ఆర్ కూడా తగిన సూచనలు ఇస్తుంటాడు. అయితే ఈసారి మాత్రం కళ్యాణ్ రామ్ టార్గెట్ మిస్ అవదని.. పక్కా సినిమా అనుకున్న అంచనాలను అందుకుంటుందని అంటున్నారు.