సంక్రాంతి పండుగ వస్తే చాలు ఎవరు ఎంత దూరంగా ఉన్నా తమ తమ ఊళ్లకు చేరుకొని పండుగను మూడు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. ఇక సెలబ్రిటీలు కూడా ఎంత బిజీగా తమ పనులు పక్కన పెట్టి పండుగ కోసం మూడు రోజులు కేటాయిస్తారు. దానిలో భాగంగా ఈ సంక్రాంతికి మెగా ఇంటికి నాగార్జున కుటుంబం వెళుతున్నారు. నాగార్జున,చిరంజీవి కుటుంబాలు కలిసి సంక్రాంతి పండుగను జరుపుకుంటున్నారు.


 అందులో రామ్ చరణ్, అల్లు శిరీష్,వరుణ్ తేజ్ ఇంకా చాలామంది ఇందులో పాల్గొన్నారు. దానిలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళ తోఎంతో ఆనందంగా ఉన్నాడు చిరంజీవి. అయితే ఈ సారి వేడుకల్లో అనుకోనిఅతిధి కనిపించారు.  ఆయనే అక్కినేని నాగార్జున.చిరు నాగ్ మధ్య మంచి స్నేహ బంధం ఉందని తెలుసు. వారితో పాటు వాళ్ల ఫ్యామిలీ కి మంచి స్నేహబంధం ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఈసారి మెగా ఇంత సంబరాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాద్ కు చెందిన మ్యూజిక్ బ్యాండ్ కచేరి తో రుచికరమైన వంటలను ఆరగిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇలా మెగా ఫ్యామిలీ అక్కినేని ఫ్యామిలీ ఒక ప్రేమ్ లో కనబడేసరికి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


 ఇది ఇలా ఉంటే ఎప్పుడూ పండుగ వచ్చినా ప బ్బమ్ వచ్చినా పవన్ మాత్రం అలాగే ఉంటాడు. ఎవరితోనూ పెద్దగా కలవడు. కుటుంబంతో కలవడం కూడా కష్టమే. ఎప్పుడో ఒకసారి ఆయన కుటుంబంతో పాటు పండుగలు సెలబ్రేట్ చేసుకుంటాడు. మెగా ఫ్యామిలీ లో అక్కినేని ఫ్యామిలీ సెలబ్రేషన్ లో పవన్ ఇంట్లో సడన్ ఎంట్రీ ఇచ్చాడు. పవన్ ను చూసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిజంగానే షాక్ అయ్యాడు.

 బాబాయ్ తో తనకు చాలా మంచి అనుబంధం ఉందని చెప్పాడు. ఎప్పటికప్పుడు తమ బంధం గురించి చెప్తూనే ఉంటాడు మెగా వారసుడు. అప్పట్లో నాయక్ సినిమా ఆడియో రిలీజ్ సమయంలో తన తండ్రి తరువాత ఆ స్థానాన్ని పవన్ కళ్యాణ్ దే అని రామ్ చరణ్ చెప్పారు. ఎవరైనా బాబాయ్ తో మాట్లాడాలి అంటే ముందు నాతో మాట్లాడాలి అంటూ రామ్ చరణ్ తన బాబాయ్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. సెలబ్రేషన్ అయిపోయాక తన ఇంటికి తీసుకుని వెళ్లి అక్కడ పవన్ ను కలసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు రామ్ చరణ్.

మరింత సమాచారం తెలుసుకోండి: