టాలీవుడ్ హీరో మాస్ రాజా రవితేజ నటించిన తాజా సినిమా క్రాక్. సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్ పై బి. మధు నిర్మాతగా రూపొందిన ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించగా శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. ఎస్ తమన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమాకి ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ జీకే విష్ణు కెమెరామెన్ గా పని చేయడం జరిగింది. సంక్రాంతి కానుకగా ఈనెల 9వ తేదీన రిలీజ్ అయిన సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకని ప్రస్తుతం భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

పోతురాజు  వీరశంకర్  అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని ఈ సినిమాలో రవితేజ పోషించారు. ఇక ఆ పాత్రలో ఆయన అత్యద్భుత నటనకు ప్రేక్షకాభిమానుల నుంచి విపరీతమైన అప్లాజ్ లభిస్తోంది. అలానే హీరోయిన్ గా నటించిన శృతిహాసన్, ప్రతి నాయకుడిగా నటించిన సముద్రఖని, నెగిటివ్ పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ లకు కూడా అందరి నుంచి మంచి ప్రశంసలు అందుతున్నాయి. మంచి మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా రవితేజ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకునేలా ఈ మూవీ తెరకెక్కించడంలో దర్శకుడు గోపీచంద్ మలినేని బాగా సఫలమయ్యారు అని చెప్పాలి.

ఇక లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా కరోనా వలన సగం సీటింగ్ తో కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటీవల బ్రేక్ ఈవెన్ ని సునాయాసంగా దాటేయడంతో పాటు ప్రస్తుతం దాదాపుగా ఎనిమిది కోట్లకు పైగా లాభాలు దక్కించుకుని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తుందని అంటున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఈ సినిమా థియేటర్స్ పెంచారని రాబోయే మరికొద్ది రోజుల్లో మిగిలిన ప్రాంతాల్లో కూడా థియేటర్స్ పెంచనున్నారని సమాచారం. చాలా గ్యాప్ తర్వాత రవితేజ కు మంచి కమర్షియల్ సక్సెస్ రావడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అర్థమైందా పోతురాజు వీరశంకర్ దెబ్బంటే గోల్కొండ అబ్బ అని అంటూ పలువురు రవితేజ అభిమానులు క్రాక్ మూవీ కలెక్షన్స్ పై తమదైన రీతిలో సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: