మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇటీవల వరుసగా సక్సెస్ లతో కొనసాగుతూ దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ఆచార్య.కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఎంతో భారీ ఖర్చుతో నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక మాజీ నక్సలైట్ గా కనిపించనున్నట్లు సమాచారం. ఆయనకు జోడీగా కాజల్ అగర్వాల్ కనిపించనున్న ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా ప్రముఖ ఛాయాగ్రాహకుడు తిరు ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ నిన్నటి నుండి ప్రారంభమైంది. కాగా ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తొలిసారిగా తన తండ్రితో కలిసి నటిస్తుండటం ఎంతో ఉద్వేగంగా ఉందని తప్పనిసరిగా ఈ సినిమాలోని తన పాత్ర ప్రేక్షకాభిమానులను అలరిస్తుందని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భాగంగా చరణ్ మాట్లాడుతూ చెప్పారు. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ఫుల్ పాత్ర పోషిస్తున్నట్లు కొద్ది రోజుల క్రితం మూవీ యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలిపింది. అయితే ఈ సినిమాలో చరణ్ పాత్ర విషయమై ప్రస్తుతం ఒక వార్త పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది.

దానిని బట్టి ఈ సినిమాలో చరణ్ సిద్ధ అనే విద్యార్థి నాయకుడి పాత్ర పోషిస్తున్నారని సినిమాలో ఈ పాత్ర సెకండాఫ్ లో వస్తుందని, అయితే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చే ఈ క్యారెక్టర్లో రాంచరణ్ పెర్ఫార్మన్స్ అందరినీ ఆకట్టుకోవడం ఖాయం అని కానీ ఎవరూ ఊహించని విధంగా ఆ పాత్ర ప్రీ క్లైమాక్స్ లో చనిపోతుందని అదే సినిమాలో ఎవరూ ఊహించని అతి పెద్ద ట్విస్ట్ అని  అంటున్నారు. మరి  ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే ఈ సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు. ఇక తొలిసారిగా మెగాస్టార్, మెగా పవర్ స్టార్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీగా అంచనాలు నెలకొన్నాయి. మరి ఆ అంచనాల్ని ఈ మూవీ ఎంత మేరకు అందుకుంటుందో తెలియాలంటే దీని రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: