రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నిన్న లైగర్ ఫస్ట్ లుక్ తో అభిమానులను ఫుల్ ఖుషి చేశాడు. చాల రోజుల తర్వాత విజయ్ సినిమా ఫస్ట్ లుక్ రావడంతో అభిమానులు కూడా దాన్ని పండగలా చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు లైగర్ పోస్టర్ ని బ్యానర్ లు గా కట్టి అభిమాన హీరో పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.. టాలీవుడ్ లో ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన హీరోగా విజయ్ దేవరకొండ ఇంతటి స్థాయికి ఎదగడం అంటే మాటలు కాదు. తెరపైకి రావడమే ఉప్పెన లా దూసుకొచ్చి సముద్రంలా మారిపోయాడు. యాక్టింగ్ లో, లుక్ లో, ఓ కొత్త ట్రెండ్ ని సృష్టించి ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. అయన నటించిన అర్జున్ రెడ్డి సినిమా ని ఇప్పటికే గుర్తు చేసుకుంటున్నారంటే ఆ సినిమా ఎంతటి ఎఫెక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. నిన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా ఆ లుక్ కి ప్రేక్షకులనుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ బాడీ లాంగ్వేజ్ కి తగిన రొమాంటిక్ యాక్షన్ మూవీ నే పూరీ తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమాలో 'అనన్య పాండే' హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఆమెకి ఇదే తొలి సినిమా. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న అనన్యసినిమా లో నటించడం విశేషం అయితే కరణ్ జోహార్ కూడా ఓ నిర్మాత కావడం మరింత విశేషం..

తెలుగుతో పాటు ఇతర భాషల్లోను త్వరలో విడుదల కానున్న ఈ సినిమా కోసం ఎంత బడ్జెట్ అయినా పెట్టేందుకు రెడీ గా ఉన్నారు నిర్మాతలు.  విజయ్ దేవరకొండకిగల క్రేజ్ కారణంగా  బడ్జెట్ విషయంలో వెనకాడకపోవడంలో అర్థం ఉంది. అలాగే భారీస్థాయిలో విడుదల చేయడంలోను అర్థం ఉంది. అయితే ఆ క్రేజ్ ను .. మార్కెట్ ను నిలబెట్టుకోవలసిన బాధ్యత మాత్రం విజయ్ దేవరకొండపైనే ఉంది. క్రేజ్ .. మార్కెట్ వాల్యూ ఎప్పుడూ ఒకేలా ఉండవు .. హిట్ పడకపోతే అవి పల్స్ రేటుకన్నా దారుణంగా పడిపోతాయి. అందుకోసమే ఇక్కడ హిట్టుకోసం ఒట్టుపెట్టుకు కూర్చుంటారు. అలాంటి హిట్ విజయ్ దేవరకొండకి పడక చాలాకాలమే అయింది. ఈ సినిమా తో అయినా హిట్ కొట్టాలని ఆశిద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి: