ఈ ఏడాదిలో పాన్ ఇండియా సినిమాలు జోరుమీద తెరకెక్కుతున్నాయి. మూడే మూడు పాన్ ఇండియా సినిమా పట్ల యావత్ సినీ ప్రేక్షకులు అవి ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన టీజర్లు రిలీజ్ అయ్యి.. ప్రేక్షకులు వాటిపట్ల మరింత ఆసక్తిగా ఎదురు చూసేలా చేస్తున్నాయి. వీటిలో దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న  ‘ఆర్ఆర్ఆర్’, రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న‘రాధేశ్యామ్’, రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న‘కేజీఎఫ్ 2’ సినిమాలు ప్రేక్షకుల్లో భారీ అంచనాలే పెంచాయి.

 ఈ సినిమాలు చాలా కాలం  నుంచి షూటింగ్ జరుపుకుంటున్నా.. వీటి రిలీజ్ డేట్స్ ను మాత్రం కన్ఫామ్ చెయ్యలేకపోతున్నారు మేకర్స్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా యంగ్ హీరో రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా షూటింగ్ లాక్ డౌన్ ముగిసిన వెంటనే స్టార్ట్ అయ్యింది. అంటే దాదాపుగా ఆరునెలలకు పైనే అవుతుంది ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి. ఈ లెక్కన చూస్తే ఈ పాటికి దర్శక ధీరుడి సినిమా కంప్లీట్ కావాల్సి ఉండే. కానీ అది కాలేదు.. ఈ సినిమా విడుదలపై కూడా ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు రాజమౌళి. ఇకపోతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో వస్తున్న‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ ఈ మధ్యనే పూర్తి అయ్యింది.

కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలి ఉండటంతో ఈ సినిమా రిలీజ్ పై ఇంకా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు మేకర్స్. వీరితో పాటుగా కన్నడ రాకింగ్ స్టార్ యష్  హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కేజీఎఫ్ 2’ సినిమా షూటింగ్ కూడా ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించడం కోసం షూటింగ్ సెట్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు ఈ చిత్ర యూనిట్. ఏదేమైనా ఈ మూడు పాన్ ఇండియా సినిమాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. టీజర్లతో ప్రజలను ఆకట్టుకుంటున్న ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా ప్రజలకు తెలియడం లేదు. అసలు ఈ ఏడాదన్నా రిలీజ్ అవుతాయా లేదా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: