రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు ఆయన సినిమా అంటేనే జనాలకు అదో పిచ్చి. మరో ఇప్పుడు లేదా? అంటే అది మాత్రం చెప్పలేం. ఎందుకంటే వర్మ తన మేకింగ్ స్టైల్ పూర్తిగా మార్చేశారు. డిఫరెంట్ జానర్స్‌లో సినిమాలు తీస్తూ ప్రేక్షకులను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు.వివాదాల డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తాజాగా వెబ్ సిరీస్ రూపంలో మరో వివాదానికి తెరలేపాడు.మొన్నటివరకు రొమాన్స్ జానర్ ను పట్టుకొని వేలాడిన వర్మ.. ఇప్పుడు మళ్లీ తన పంథా మార్చినట్లుగా అనిపిస్తుంది. కానీ ఏది చేసిన వివాదాస్పద అంశాలను లేవనెత్తడం మాత్రం మానలేదు.

 తాజాగా మ‌రో య‌దార్థ సంఘ‌ట‌న ఆధారంగా వెబ్ సిరీస్ నిర్మించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు..'ఇది మహాభారతం కాదు' అనే వెబ్ సిరీస్ రూపొందిస్తున్నట్లు పోస్టర్ వీడియో విడుదల చేసి ప్రకటించాడు.యదార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా తెర‌కెక్కుతున్న క‌ల్పిత చిత్రం అంటూ న్యాయ‌స్థానాల‌కు దొర‌క్కుండా త‌ను అనుకున్న‌ది చేసుకుంటూ వెళ్తున్నాడు.  దీనికి రచన సిరాశ్రీ కాగా, ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఓవరాల్ పర్యవేక్షణ వర్మ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, దీనికి సంబంధించిన ఆడియో పోస్టర్ ను వర్మ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు.అయితే ఏంలేదనుకున్నా వర్మ ఇది మహాభారతం కాదు అనే టైటిల్ తోనే ఆసక్తి కలిగించాడనే చెప్పాలి. ప్రస్తుతం 'ఇది మహాభారతం కాదు' అనే ప్రకటన సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

గిది 2019ల తెలంగాణలో ధర్మన్న, దుర్యన్న ఫ్యామిలీల నడిమిట్ల లొల్లి లేపిన ద్రుపది, కొట్లాట పెట్టిన గోపాల్ యాదవ్ గాని కథ’ ఆధారంగా తీస్తున్న వెబ్ సిరీస్‌గా ఆర్జీవీ ప్ర‌క‌టించాడు. ఇక పోస్టర్ ఆడియోలో వర్మ మాట్లాడుతూ.. 'మహాభరతంలో కనిపించే పాత్రలు ప్రపంచంలో ఎక్కడో ఒక చోట తారసపడుతుంటాయని తెలంగాణలోని ఓ పట్టణంలోనూ అలాంటి వ్యక్తులు ఉన్నారని దీని ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తీస్తున్నాం' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వెబ్ సిరీస్ ప్రకటన చూస్తే వర్మ పిచ్చి పీక్స్ లోకి వెళ్లిందని అర్ధమవుతుంది

మరింత సమాచారం తెలుసుకోండి: