నిర్మాతను తండ్రితో పోలుస్తారు. ప్రొడ్యూసర్‌కు కష్టం.. నష్టం కలగకూడదంటారు. అందుకే.. గతంలో కొందరు హీరోలు సినిమా ఫ్లాప్‌ అయితే.. ఆ నిర్మాతకు మరో అవకాశం ఇచ్చేవారు. తెలుగు ఇండస్ట్రీకి ఇద్దరు స్టార్స్‌ను అందించిన నిర్మాతను వాళిద్దరూ మర్చిపోయారు.

మహేశ్‌బాబు సూపర్‌స్టార్‌ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా.. స్టార్‌ ఇమేజ్‌ తీసుకొచ్చిన సినిమా ఒక్కడు. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఎంఎస్‌ రాజు నిర్మించారు. సినిమా రిలీజై 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. నమ్రత తన ఇన్‌స్టాలో చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్ట్‌ పెట్టగా.. నిర్మాత పేరు మెన్షన్‌ చేయలేదు. దీనికి ఎంఎస్‌ రాజు హర్ట్‌ అయ్యారు.

ఒక్కడు గురించి నమ్రత పెట్టిన పోస్ట్‌లో తన పేరు లేకపోవడంతో.. సోషల్ మీడియా వేదికగా ఎమ్ఎస్ రాజు స్పందిస్తూ.. 'మిస్టేక్స్‌ జరుగుతూ ఉంటాయి. నా పేరు మర్చిపోయినప్పటికీ నమ్రత ఒక్కడును క్లాసిక్‌ మూవీగా చెప్పినందుకు సంతోషంగా ఉంది. గుడ్‌ లక్‌' అంటూ మహేశ్‌బాబుని ట్యాగ్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో రాజుగారు ఎంతగా బాధపడకపోతే.. ఇలా పోస్ట్‌ చేశారంటున్నాయి ఫిలిం వర్గాలు.

అదేమిటోగానీ.. ఎమ్ ఎస్ రాజు చేతుల మీదుగా స్టార్ట్ అయిన వాళ్లే ఆయన్ని మర్చిపోతున్నారు. వర్షం మూవీతో ప్రభాస్‌ను స్టార్‌ని చేశారు.  సినిమా రిలీజ్ అయి 17 ఏళ్లయిన సందర్భంగా ప్రభాస్ నిర్మాతను మర్చిపోయి 'వర్షం' సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

మొత్తానికి ఎమ్ఎస్ రాజును మహేశ్ బాబు, ప్రభాస్ హర్ట్ చేశారట. మహేశ్ బాబు ఒక్కడుతో స్టార్ అయిపోగా.. ప్రభాస్ వర్షంతో క్రేజీ స్టార్ అయిపోయాడు. ఈ చిత్రాలను నిర్మించిన ఎమ్ఎస్ రాజును మరిచిపోవడంపై ఆయన హర్ట్ అయ్యారు.
వర్షం వచ్చి 18ఏళ్లు అయిన సందర్భంగా నమ్రత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్.. ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. చూద్దాం.. నమ్రత మళ్లీ ఎమ్ఎస్ రాజుకు ఎలా బదులిస్తుందో.





మరింత సమాచారం తెలుసుకోండి: