పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ లో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. రీసెంట్ గానే పవన్ కళ్యాణ్ తన లేటెస్ట్ ప్రాజెక్ట్ "వకీల్ సాబ్" షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నాడు. ఇప్పుడు, క్రిష్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ సినిమాపై మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ కూడా కీలక పాత్ర పోషిస్తోందట.

అనసూయ భరద్వాజ్ టాలీవుడ్ లోనే మోస్ట్ బిజీయెస్ట్ యాక్ట్రెస్ అలాగే యాంకర్ కూడా. స్మాల్ స్క్రీన్ లో ఎన్నో ప్రాజెక్ట్స్ తో ప్రస్తుతం ఈ జబర్దస్త్ భామ బిజీగా ఉంది. ఈ ముద్దుగుమ్మ ఫోకస్ వెండితెరపై ఉందని క్లియర్ గా అర్థమవుతోంది.

ఈ సినిమాలో అనసూయ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన స్పెషల్ సాంగ్ లో నర్తించే అవకాశం ఉందని తెలుస్తోంది. నిజానికి, ఇంతకు ముందే అనసూయకు పవన్ కళ్యాణ్ "అత్తారింటికి దారేది"లో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసే అవకాశం దక్కింది. కానీ, అనసూయే ఈ ఛాన్స్ ను మిస్ చేసుకుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ సరసన స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసే అవకాశాన్ని అనసూయ మిస్ చేసుకునే ఛాన్స్ లేదని ఫిలింనగర్ గుసగుసలు. అనసూయ, ఈసారి ఆ తప్పు చేయదని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఎందుకంటే, ఈ ఏడాది సినిమాలపై దృష్టిపెట్టాలని అనసూయ భావిస్తోందని తెలుస్తోంది. అందులో భాగంగా తమిళ్ అలాగే మలయాళంలోని మూవీస్ కు కూడా అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే, పీరియడ్ డ్రామాగా తెరకెక్కుతున్న పవన్ కళ్యాణ్ సినిమాలో అనసూయకు స్పెషల్ సాంగ్ దక్కడం నిజంగా ఆమె అదృష్టమని, నిజానికి ఈ ఆపర్ట్యూనిటీ కోసం ఎంతోమంది స్టార్  హీరోయిన్స్ కూడా ఎదురుచూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: