టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మూడు హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. గత ఏడాది విడుదలైన "సరిలేరు నీకెవ్వరు" చిత్రం టాలీవుడ్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అదే ఉత్సాహంతో ఇప్పుడు పరశురాం దర్శకత్వంలో "సర్కారు వారి పాట" సినిమా చేస్తున్నాడు. గత సినిమాలతో పోలిస్తే మహేష్ ఇందులో చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. అందుకు తగ్గట్టుగానే మహేష్ లాంగ్ హెయిర్ తో దర్శనమిస్తున్నాడు. మహేష్ ఇందులో డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.

 ఈ సినిమా బ్యాంకింగ్ వ్యవస్థలో జరిగే కుంభకోణాల నేపథ్యంలో ఉండనునట్టు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాల్లో ఎక్కువగా మన తెలుగు సినిమాలే కనిపిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు మన స్టార్ హీరోలు అంతా పాన్ ఇండియన్ మార్కెట్ పై కన్నేశారు. దాంతో మహేష్ కూడా పాన్ ఇండియా బాట పడుతున్నట్టు ఫిలింనగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సూపర్ స్టార్ మహేష్ ది ఇంటర్నేషనల్ కటౌట్ కావడంతో మహేష్ అభిమానులు కూడా ఎప్పటినుండో తమ హీరో పాన్ ఇండియా స్థాయిలో రాణించాలని కోరుకుంటున్నారు.

అయితే ఇన్నాళ్లకు వారి కోరిక నెరవేరే అవకాశం కనిపిస్తుంది. మహేష్ పాన్ ఇండియన్ ఎంట్రీ పై  గత కొన్నాళ్ల నుంచి వార్తలు గట్టిగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం “సర్కారు వారి పాట” సినిమాను పాన్ ఇండియా సినిమాగా విడుదల చేస్తారని రూమర్స్ ఈమధ్య బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్ ప్రముఖ నటుడు అనీల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తాడని టాక్ వచ్చింది. ఇప్పుడు ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో ఖచ్చితంగా ఈ చిత్రం కూడా పాన్ ఇండియన్ రిలీజ్ కు ఛాన్సెస్ ఉన్నాయని చెప్పాలి. మరి అదేవిధంగా తర్వాతి సినిమా మా రాజమౌళితో ఉండనుంది. కాబట్టి "సర్కారు వారి పాట" పాన్ ఇండియా వైపు మహేష్ తొలి అడుగు వేస్తున్నాడని చెప్పాలి.. మరి ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటెర్టైన్మెంట్స్ వారు మరియు మహేష్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: