వి.వి.వినాయక్ 'ఇంటిలిజెంట్' ఫ్లాప్ తర్వాత కొంచెం స్లో అయ్యాడు. మధ్యలో 'శీనయ్య' సినిమాతో యాక్టింగ్లోకి కూడా వెళ్లాడు. అయితే ఈ మూవీ ఆగిపోయాక, చిరంజీవితో 'లూసిఫర్' రీమేక్ చేసే అవకాశం వచ్చింది. స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ చేశాక, సడన్గా వినాయక్ ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు వెళ్తున్నాడనే టాక్ వచ్చింది. ఆ వెంటనే వినాయక్ డైరెక్షన్లో 'ఛత్రపతి' రీమేక్ అనౌన్స్మెంట్ వచ్చింది.
వినాయక్ డైరెక్షన్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా 'ఛత్రపతి' రీమేక్ రాబోతోంది. అయితే 'ఛత్రపతి' సినిమా ఇప్పటికే హిందీలో డబ్ అయ్యింది. 'హుకూమత్ కీ జంగ్' పేరుతో యూట్యూబ్లో 'ఛత్రపతి' డబ్బింగ్ మిలియన్ల కొద్ది వ్యూస్ తెచ్చుకుంది. 'బాహుబలి' హీరో ప్రభాస్ సినిమా అనే ఇదిలో నార్త్లో చాలామంది 'ఛత్రపతి' డబ్బింగ్ని చూసేశారు.
వినాయక్ కంపల్సరీగా హిట్ కొట్టాల్సిన స్టేజ్లో బాలీవుడ్కి వెళ్తున్నాడు. దీనికితోడు హిందీ వాళ్లు చూసిన కథనే మళ్లీ డైరెక్ట్ చేస్తున్నాడు. సో పాత కథనే కొత్తగా చూపించడం ఒక చాలెంజ్ అనే చెప్పాలి. పైగా రాజమౌళి రేంజ్ ఎమోషన్ని క్రియేట్ చెయ్యడం కూడా కొంచెం కష్టమే. మరి ఈ సవాళ్లని వినాయక్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.
వి.వి.వినాయక్ కు ఛత్రపతి ఛాలెంజ్ విసురుతోంది. అయితే ఆల్ రెడీ హిందీలో ఛత్రపతి డబ్ అయింది. అయితే ఛత్రపతిని వినాయక్ హిందీలో రీమేక్ చేస్తుండటంతో ఇపుడు బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. 'ఛత్రపతి' రీమేక్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తుండటం విశేషం. అయితే ఇంటెలిజెంట్ ఫ్లాప్ తో స్లో అయిన వినాయక్ ఈ సినిమాతో అయినా విజయం సాధిస్తాడేమో చూడాలి.