అయితే ఈ మధ్య కాలంలో ప్రభాస్ గురించి ఇంకో విషయం వైరల్ గా మారింది ప్రభాస్ , అనుష్కల ప్రేమ వ్యవహారం. వీరిద్దరూ కలిసి నటించిన మిర్చి, బిల్లా బాహుబలి సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ప్రభాస్, అనుష్క జంట ఎవర్ గ్రీన్ హిట్ పెయిర్ గా నిలిచారు. అయితే సోషల్ మీడియాలో బాహుబలి సినిమా నుంచి వీరిద్దరి ప్రేమ వ్యవహారం వైరల్ అవుతూనే ఉంది.
తాజాగా ఇప్పుడు వైరల్ అవ్వడానికి కారణం ఏంటంటే ! "భాగమతి" సినిమా తరువాత ఏడాది విరామం తీసుకున్న అనుష్క "నిశ్శబ్దం" సినిమా చేసింది. అప్పటి నుంచి అనుష్క దాదాపు రెండు సంవత్సరాలు సినిమాల్లో నటించడం లేదు. అయితే బాగమతి సినిమా తీసిన మూవీ క్రియేషన్ లోనే మళ్లీ సినిమా చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఏంటి అనుకుంటున్నారా. యూవీ క్రియేషన్స్ ఎవరిదో కాదు హీరో ప్రభాస్ సొంత బ్యానర్ కావడమే దీనికి కారణం. రెండు ఏళ్ల నుంచి ఏ సినిమా ఒప్పుకొని అనుష్క ఒక్కసారిగా యూవీ క్రియేషన్ బ్యానర్ లో సినిమా రాగానే ఎందుకు ఒప్పుకుంది . ఈ సినిమా ప్రభాస్ కోసమే చేస్తోందా అన్న సందేహం అందరికీ కలుగుతోంది. దీంతో మళ్లీ ప్రభాస్ అనుష్క ల ప్రేమ వ్యవహారం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
ఏది ఏమైనప్పటికీ అనుష్క, ప్రభాస్ ల కాంబినేషన్ లో సినిమాలు చూస్తే ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే.