టాలీవుడ్ సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన బ్లాక్ బాస్టర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మలయాళంలో సూపర్ హిట్ అయినా లూసిఫర్ సినిమాను అలాగే తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయినా వేదాళం సినిమాను తెలుగులోకి రిమేక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే దాదాపుగా 50% పూర్తయిన ఈ సినిమా షూటింగ్ లో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా జాయిన్ అయ్యారు.

 రామ్ చరణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నక్సల్స్ నేపథ్యంలో ఉందని గాస్సిప్స్ వినిపిస్తున్నాయి. టాలీవుడ్ లో  భారీ ఫాలోయింగ్ ఉన్న తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నటిస్తున్న భారీ చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దాంతో ఈ సినిమా యొక్క టీజర్  కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అందుకు తగ్గట్టుగానే దీనిపై లేటెస్ట్ గాసిప్స్ కూడా మొదలయ్యాయి. ఈ టీజర్ ను మేకర్స్ తొందరలోనే విడుదల చేస్తారని రూమర్స్ మొదలయ్యాయి.

మరి అది కూడా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తారని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. మరి నిజంగానే ఈ టీజర్ రిపబ్లిక్ డే కానుకగా వస్తుందా లేదా అన్నది తెలియాలంటే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మ్యారేజ్ తర్వాత కాజల్ నటిస్తున్న మొదటి చిత్రం. ఇక ఈ చిత్రానికి సంగీత బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు. మరి ఈ సినిమాతో మెగాస్టార్,మెగాపవర్ స్టార్ ఎలాంటి విజయాన్ని నమోదుచేస్తారో  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: