పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తర్వాత సినిమాల జోరు పెంచిన సంగతి తెలిసిందే. ఆయన కెరియర్లో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా ఐదు సినిమాలను లైన్ లో పెట్టి తన ఫ్యాన్స్ కే కాదు కామన్ ఆడియన్స్ కి కూడా ఆశ్చర్యాన్ని కలిగించాడనే చెప్పుకోవాలి. ప్రస్తుతం పింక్ రీమేక్ గా తెరకెక్కుతున్న '‘వకీల్ సాబ్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన పవన్ వెంటనే తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు. మలయాళంలో లో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమా తెలుగు రీమేక్ లో రానాతో కలిసి పవన్ నటించనున్నాడు.

ఈ సినిమాను సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా క్రిష్ డైరెక్షన్ లో ఒక పిరియాడికల్ మూవీ కూడా చేస్తున్నారు. అయితే రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కించనున్నట్లు సమాచారం. పవన్ డేట్స్ దృష్ట్యా టైమ్ చాలా తక్కువ ఉండటంతో పవన్ రెండు సినిమాలను ఒకేసారి చేస్తున్నారు. పైగా రెండు చిత్రాల్లోనూ ఆయన లుక్ దాదాపు ఒకేలా ఉండటంతో ఈ ప్లాన్ బాగా కలిసొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ నగర శివార్లలోని అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద ఈ రెండు సినిమాలకు సంబంధించిన సెట్లను నిర్మించారు. పవన్ కంఫర్ట్ కోసం సెట్లు రెండూ పక్కపక్కనే ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. దీంతో పవన్ తక్కువ వ్యవధిలోనే రెండు సినిమాల షూటింగ్ ల్లో పాల్గొంటున్నారు. మధ్యలో ట్రావెలింగ్ టైమ్ చాలావరకు తగ్గిపోయింది. పవన్ డేట్లను దృష్టిలో పెట్టుకుని రెండు సినిమా బృందాలు ఇలా ఒక అవగాహనతో పరస్పరం సహకరించుకోవడం నిజంగా అభినందించదగిన విషయమే.

ఈ రెండింటిలో ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ ముందుగా పూర్తయ్యే అవకాశం ఉండగా పిరియాడికల్ మూవీ కావడంతో క్రిష్ సినిమా ఎక్కువ సమయం తీసుకునేలా కనిపిస్తోంది. వీటితో పాటుగా మరొక మూడు సినిమాలను పవన్ లైన్ లో పెట్టాడు. హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి, సంతోష్ శ్రీనివాస్, వంటి డైరెక్టర్లు పవన్ కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. రీ ఎంట్రీ తర్వాత పవన్ ఇన్ని సినిమాలకు ఒప్పుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి: