ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు తీసి అన్ని సూపర్ హిట్లు అందుకునే అల్లరి నరేష్ ఈమధ్య పూర్తిగా కెరియర్ లో వెనకపడ్డాడు. 2019లో మహర్షి సినిమాలో మహేష్ ఫ్రెండ్ పాత్రలో నటించిన అల్లరి నరేష్ తన నెక్స్ట్ సినిమా కోసం ఇన్నాళ్లు వెయిట్ చేయాల్సి వచ్చింది. బంగారు బుల్లోడు అంటూ బాలయ్య టైటిల్ తో తన లక్ టెస్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు అల్లరోడు. ఈ సినిమాను గిరి డైరెక్ట్ చేశారు. నందిని నర్సింగ్ హోం సినిమాతో మెప్పించిన గిరి ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.

సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజైంది. ట్రైలర్ చూస్తే అల్లరోడికి ఈసారి హిట్టు పక్కా అనేలా ఉంది. తన మార్క్ కామెడీతో మెప్పించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు. ఇక సినిమాలో హీరోయిన్ గా పూజా ఝవేరి నటించింది. విజయ్ దేవరకొండ ద్వారక సినిమాలో ఆమె నటించిన విషయం తెలిసిందే. బంగారు బుల్లోడు సినిమాను ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. సినిమా ట్రైలర్ జోష్ చూస్తుంటే అల్లరి నరేష్ ఈసారి అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యేలా ఉన్నాడు.

సినిమా ట్రైలర్ లో కథ ఏంటన్నది తెలుస్తుంది. మరి ఈ కథను దర్శకుడు ఎలా ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించాడు అన్నది చూడాలి. అల్లరి నరేష్ మాత్రం ఈ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత అల్లరొడు సీరియస్ పాత్రలో నాంది సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో అల్లరి నరేష్ న్యూడ్ గా కూడా కొన్ని సీన్స్ లో నటించాడని తెలుస్తుంది. అల్లరి నరేష్ మాత్రం ఒకప్పటి నరేష్ ను గుర్తు చేసేలా కామెడీ ఎంటర్టైనర్ గా వస్తుంది. ట్రైలర్ అంతా సరదా సరదాగా సాగింది. అయితే సినిమా కథ కూడా డిఫరెంట్ గా ఉండబోతుందని మాత్రం అర్ధమవుతుంది.     
 

మరింత సమాచారం తెలుసుకోండి: