మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాం చరణ్ తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా దేవాలయాల భూములు, కుంభకోణాల నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు టాక్. అత్యంత భారీ వ్యయంతో ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై రాం చరణ్, నిరంజన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా చరణ్ కి జోడీగా రష్మీక మందన్న నటించనున్నట్లు టాక్. ఇక ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే లేటెస్ట్ గా కొన్ని ఫిలిం నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో మెగాస్టార్ చిరంజీవి, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి నటించబోయే సినిమా రూపొందనుందని అంటున్నారు.

ఇటీవల టాలీవుడ్ కి చెందిన ఒక టాప్ డైరెక్టర్, తన వద్దనున్న ఒక మంచి యాక్షన్ ఓరియెంటెడ్ మల్టీస్టారర్ మూవీ స్టోరీ ని ఒక అగ్ర నిర్మాణ సంస్థకు చెప్పడం, అది విని ఎంతో నచ్చిన ఆ సంస్థ వారు, ఇది సరిగా చిరంజీవి, అల్లు అర్జున్ లకు పక్కగా సెట్ అవుతుందని భావించి సదరు దర్శకుడిని వెళ్లి వారిద్దరినీ కలిసి కథ వినిపించమని చెప్పారట. అయితే ఆ కధ ని విన్న చిరంజీవి, అల్లు అర్జున్ ఇద్దరూ కూడా ఎంతో మెచ్చుకోవడంతో పాటు నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. అయితే ప్రస్తుతం తాము ఒప్పుకున్న కమిట్మెంట్స్ అనంతరమే దీనికి పట్టాలెక్కిద్దాం అని కూడా చెప్పారట. దాదాపుగా రూ 250 కోట్ల భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో పాన్ ఇండియా రేంజ్ లో దీనిని సదరు నిర్మాణ సంస్థ నిర్మించనుందని, అలానే దీనికి సంబందించిన అధికారిక ప్రకటన కూడా అతి త్వరలో రానుందని అంటున్నారు. మరి ఈ వార్త కనుక నిజమే అయితే నిజంగా ఇది మెగా ఫ్యాన్స్ కి మంచి పండుగ వార్త అని చెప్పక తప్పదు...... !!

మరింత సమాచారం తెలుసుకోండి: