చాలా కాలం తర్వాత క్రాక్ సినిమాతో హిట్ కొట్టి ఫిల్మ్ నగర్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు గోపీచంద్ మలినేని. ఈ ఏడాది సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ కాగా కేవలం క్రాక్ సినిమా ఒక్కటే విన్నర్ గా నిలిచింది. ఈ సినిమా హిట్ కావడంతో గతంలో తాను ఫోన్ చేసినా ఫోన్ ఎత్తని చాలా మంది ఇప్పుడు తిరిగి ఫోన్ చేసి అభినందనలు తెలుపుతున్నారు అని దర్శకుడు చెబుతున్నాడు. అయితే తాజాగా ఈ దర్శకుడికి బంపర్ ఆఫర్ తగిలినట్లు చెబుతున్నారు. నిజానికి ఈ దర్శకుడిని నిన్న చిరంజీవి తన ఇంటికి పిలిపించుకుని కాసేపు ముచ్చటించాడు. 

ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు గోపీచంద్ మలినేని తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. "ఈ రోజు నాకు మెగా డే, చిరంజీవి గారి నుంచి ప్రశంసలు రావడం అంటే ఒక కమర్షియల్ సక్సెస్ కి నిజమైన సాక్ష్యం, చిరంజీవి గారి కలయిక ఎప్పుడూ కొత్త విషయాల్ని నేర్పుతుంది, ఈ చిన్న మీటింగ్ లో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను" అంటూ ఆయన ట్విట్టర్లో రాసుకొచ్చాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు చిరంజీవి తన కోసం స్క్రిప్ట్ రెడీ చేయమని గోపీచంద్ ని కోరినట్లు చెబుతున్నారు.

 ఒకవేళ నిజం గానే సరైన స్క్రిప్ట్ రెడీ చేయగలిగితే త్వరలోనే సినిమా కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి చిరంజీవి బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది కానీ బాబీ సరైన స్క్రిప్ట్ చిరంజీవికి చెప్పకపోవడంతో బాబీని పక్కన పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు బాబీ స్థానంలోనే గోపీచంద్ మలినేని తో చిరంజీవి సినిమా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చిరంజీవి వరుస సినిమాలు లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: