పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు క్రిష్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షెడ్యూల్ గురువారం తో పూర్తి కానుంది. రెండు పాటల్ని షూట్ చేసిన టీం ఈ షెడ్యూల్ పూర్తి చేయగానే సుమారు 20 రోజులపాటు షూటింగ్ కు బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ఈ సినిమాకు 'విరూపాక్ష' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నాడు క్రిష్. దాదాపుగా ఇదే టైటిల్ ఫైనల్ అయ్యే అవకాశం వుంది. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథ ఇది. పవన్ ది రాబిన్ హుడ్ తరహా పాత్రగా ఉంటుందని సమాచారం.

నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కి కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ వైఖరి క్రిష్ కి ఏమాత్రం నచ్చలేదట. సినిమా షూటింగ్ అన్న పేరే కానీ షూటింగ్ లో పాల్గొనడం కంటే సెట్ కి వచ్చే దర్శక నిర్మాతలను, అతిధులను కలవడమే పవన్ కి ఎక్కువైపోయిందంటున్నారు.. షూటింగ్ గ్యాప్ లో కొద్దీ సమయమే ఉంటుంది. ఆ సమయాన్ని పవన్ పొడిగిస్తూ షూటింగ్ సమయాన్ని వేస్ట్ చేయడంతో క్రిష్ దీనిపై కొంత నిరాశ చెందుతున్నాడట.  క్రిష్ ని కొంత కలవరపరిచినా చేసేదేంలేక తన పని తాను చేసుకుపోయాడట క్రిష్..

హరీష్ శంకర్ సురేందర్ రెడ్డి లాంటి దర్శకులు పవన్ ని కలుసుకుని వెళ్లారు. దిల్ రాజు అయితే.. తరచూ సెట్లోనే కనిపిస్తున్నాడట. ఇకపోతే రాజకీయపరమైన వ్యవహారాలు కూడా ఇక్కడినుంచే చేసుకుంటున్నారట.  ఎవరొచ్చినా పవన్ వాళ్లకు టైమ్ ఇస్తూ ఉన్నాడట. దీంతో.. షూటింగ్ కి అనుకోని బ్రేకులు చాలా వస్తున్నాయని సమాచారం.  ఇక ఈ సినిమా తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు పవన్..  సురేందర్ రెడ్డి, శంకర్ లతో సినిమాలకు సన్నాహాలు జరుగుతున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: