సరిలేరు నీకెవ్వరూ సినిమా తో సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబు చాలా గ్యాప్ తర్వాత  సర్కార్ వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. పరశురామ్ దర్శకుడు.. తొలి సినిమా తో నే దర్శకుడు పరశురామ్ ప్రతిభ ఏంటో అందరికి తెలిసిపోయింది. సోలో తో హిట్ కొట్టి క్లాసిక్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. నారా రోహిత్ కి అలాంటి హిట్ ఇప్పటికీ రాలేదంటే ఆ సినిమా ఆయనపై ఎలాంటి ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చు.. ఆ తర్వాత సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు పర్వాలేదనిపించుకున్నాయి.. అయితే డైరెక్షన్ పరంగా పరశురామ్ ఈనాడు ఫెయిల్ అవ్వలేదు..

అయన దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. అందుకే కాబోలు మహేష్ బాబు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు.ఈ సినిమా లో  కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది.  మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుని రెగ్యులర్ షూటింగ్ కి రెడీ గా ఉంది.. ఇప్పటికే రిలీజ్ అయిన  ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలామందిని ఆకట్టుకుంది.. మహేష్ ని ఇలా మునుపెన్నడూ చూడలేదని అంటున్నారు.. లుక్ ఎంతో రిఫ్రెషింగ్ గా ఉందని, డెఫినెట్ గా ఫాన్స్ కి మహేష్ ట్రీట్ ఇస్తున్నాడని అంటున్నారు.

ఇకపోతే ఈ సినిమా ను నేషనల్ వైడ్ రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమా స్టోరీ కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉండే కథాంశం అని అంటున్నారు. బ్యాంక్ స్కాముల నేపథ్యంలో అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోతోన్న ఆర్థిక నేరగాళ్లను టార్గెట్ చేస్తూ ఈ సినిమా ఉంటుందట. ఇదే కనుక నిజమైతే రాజమౌళితో చేసే సినిమా కంటే ముందే మహేష్ పాన్ ఇండియాలో తొలి అడుగు 'సర్కారు వారి పాట'తో పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: