జబర్దస్త్ తో తెలుగు టీవీ యాంకరింగ్ కు గ్లామర్ అద్దిన తార అనసూయ. తన గ్లామర్ తో జబర్దస్త్ షో ని మరో లెవెల్ కి తీసుకువెళ్లారామె. ఇక అక్కడ నుంచి బుల్లితెర పై యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజితో దూసుకువెళ్ళిపోతున్నారు అనసూయ. ఇక అక్కడ నుంచి ఆమె సినిమాల వేపు ప్రయాణం మొదలు పెట్టారు. అయినా, బుల్లి తెరను విడిచి పెట్టలేదు. అక్కడ ఫుల్ టైం చేస్తూ వెండితెర మీద అడపాదడపా మంచి పాత్రలతో మెరుస్తూ వస్తున్నారు. ఆమె నటించిన రంగస్థలం.. క్షణం సినిమాల్లో పాత్రలకు ఎంతో పేరు వచ్చింది. ముఖ్యంగా మెగా హీరో రామ్ చరణ్ లీడ్ రోల్ లో నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త గా ప్రేక్షకులని మెస్మరైజ్ చేశారు అనసూయ.తదనంతరం ఆమెకు పలు సినిమాల నుంచి ప్రాధాన్యత వున్న పాత్రలు కూడా వస్తున్నాయి.

ఈ క్రమంలో ప్రస్తుతం రవితేజ నటిస్తున్న 'ఖిలాడీ', కృష్ణవంశీ రూపొందిస్తున్న 'రంగమార్తాండ', సునీల్ హీరోగా నటించే 'వేదాంతం రాఘవయ్య' సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తోంది. మరోపక్క, తమిళంలో కూడా ఎంట్రీ ఇస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా నటించే సినిమాలో కూడా నటిస్తోంది.తాజాగా అనసూయకి  ఓ క్రేజీ ఆఫర్‌ వరించినట్లు టాలీవుడ్‌ వర్గాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ -క్రిష్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఓ అప్‌కమింగ్‌ ప్రాజెక్టులో అనసూయ ప్రత్యేకగీతంలో కనిపించనుందట

కెరీర్ లో పవన్ కళ్యాణ్ మొదటిసారి ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. మొఘలుల కాలంనాటి యాక్షన్ డ్రామాగాతెరక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపిస్తారని సమాచారం.తెరక్కుతున్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపిస్తారని సమాచారం.వకీల్‌సాబ్‌ నిమా చిత్రీకరణ పూర్తికాగానే పవన్.. క్రిష్ సినిమాలో బిజీ కానున్నారు. దాదాపు 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ పవన్‌ సినిమా అత్తారింటికి దారేదిలో ఓ స్పెషల్‌ సాంగ్‌లో నటించడానికి అనసూయకు ఛాన్స్‌ వచ్చినా కొన్ని కారణాల వల్ల ఆ అవకాశాన్ని వదులుకున్నారు. ఇప్పుడు మరోసారి పవన్‌ సినిమాలో  ఛాన్స్‌ రావడంతో ఈసారి వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లుగా టాక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: