అమితాబ్‌-రాంగోపాల్‌ వర్మల ‘నిశబ్ధ్‌’ తో బాలీవుడ్‌ ఇండస్ట్రీకి తొలిసారిగా పరిచయమైంది జియా ఖాన్. ‘గజిని’, ‘హౌస్‌ఫుల్‌’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించి మంచి గుర్తింపు  తెచ్చుకున్న జియా ఖాన్‌.. 2013, జూన్‌ 3న జుహూలోని తన ఫ్లాట్‌లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయారు. అయితే, తన కూతురిది ఆత్మహత్య కాదు.. అని ఆమె ప్రియుడు సూరజ్‌ పాంచోలీనే చంపేశాడని జియా తల్లి రుబియా ఆరోపించారు. అయితే, పోలీసుల దర్యాప్తుపై రుబియా పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కేసు సీబీఐకి బదిలీ అయింది. ఈ దుర్ఘటన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా ఇప్పటికి మిస్టరీ వీడడం లేదు.

కాగా బాలీవుడ్‌లో జియా ను కొందరు దారుణంగా వేధించారని... లైంగికంగా హింసించారని.. ఇప్పుడు ఈమె చెల్లి ఆరోపణలు చేయడంతో సంచలనంగా మారింది. తాజాగా జియా మరణం పై  డాక్యుమెంటరీ విడుదల చేసింది ఓ ప్రముఖ ఛానల్. డెత్ ఇన్ బాలీవుడ్ అనే  పేరుతో ఈ డాక్యుమెంటరీ విడుదల చేశారు. ఇందులో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా జియా చెల్లి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. చనిపోయే ముందు తన అక్క ఎంతో వేదనకు గురి అయిందని విలపించింది. అప్పట్లో హౌజ్ ఫుల్ సినిమా సమయంలో తన అక్కను  వాళ్ళు ఎలా... మానసికంగా మరియు శారీరకంగా హింసించారో చెప్పుకొచ్చింది.  

హౌస్ పుల్ సినిమా షూటింగ్ సమయంలో అతడు ఆమెను ఎలా లైంగిక వేధింపులకు గురి చేశాడో...  జియా ఖాన్ తమతో ఆ విషయాలను చెప్పి ఎంతగా బాధ పడిందో ఎప్పటికీ మరువలేను అంటూ కంటతడి పెట్టుకుంది జియా సోదరి. షూటింగ్ జరుగుతున్న సమయంలోనే... నీ టాప్ తీసేయ్.. అంటూ హింసకు గురి చేశాడని..అక్కడ నేను బతకాలంటే వాళ్లు చెప్పినట్లు చెయ్యక తప్పదు.. లేదంటే వాళ్లు తనపై అబద్ధపు కేసులు పెట్టే ప్లాన్ లో ఉన్నారని... ఇలా ఎటు దిక్కు తోచని స్థితిలో ఇంటికొచ్చి మాతో ఆ చేదు విషయాలను చెప్పుకొని తన సోదరి జియా ఎంతగానో దుఃఖించేదని చెప్పుకొచ్చింది.

జియా సోదరి చేసిన సంచలన వ్యాఖ్యలకు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించారు. సాజిద్ ఖాన్ అలాంటి వాడే అంటూ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. వాళ్లు జియా ప్రాణం తీశారు.. వాళ్లు సుశాంత్‌ను చంపారు..  ఇప్పుడు నన్ను కూడా టార్గెట్ చేసి చంపాలనుకుంటున్నారు. అయినా అలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఎందుకంటే వారికి మాఫియా అండగా ఉంది. వారు ఇలాంటి పాపాలు చేస్తున్నప్పటికీ ఇంకా బలంగానే మారుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: